• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పేకాట శిబిరంపై దాడి.. కేసు నమోదు

కృష్ణా: ఉయ్యూరు రూరల్ పరిధిలోని పెదఓగిరాల గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్సై సురేష్ బాబు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,800ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 22, 2026 / 06:50 PM IST

కరీంనగర్ కార్పొరేషన్లో ‘డిప్యూటీ’ ఛాంబర్ చిచ్చు

కరీంనగర్ నగర పాలక సంస్థలో ఎన్నికలు ముగిసిన ప్రతిసారీ డిప్యూటీ మేయర్ ఛాంబర్ కేటాయింపు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. 2005లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతుండటం గమనార్హం. గతంలో డిప్యూటీగా పనిచేసిన తాజా మాజీ మేయర్ సునీల్ రావుకు ఛాంబర్ కేటాయించవద్దనే డిమాండ్ తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది.

February 22, 2026 / 06:49 PM IST

‘మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం’

MDCL: మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అదివారం బోయినపల్లిలోని తన కార్యాలయంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రాలను స్వీకరించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సౌకర్యాలు, విద్యుత్ లైన్ల మార్పు, శ్మశానవాటిక పరిరక్షణ వంటి సమస్యలను ప్రస్తావించారు.

February 22, 2026 / 06:47 PM IST

దేవతామూర్తుల ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా

SDPT: మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో శ్రీ శంభు-రామ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జనగామ MLA డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:46 PM IST

క్రీడలతోనే పిల్లల సమగ్ర వికాసం

VSP: క్రీడల ద్వారా చిన్నారుల్లో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని ఏసీపీ కె. ప్రభాకర్ అన్నారు. మురళీనగర్ స్కేటింగ్ పార్కులో కియా వరల్డ్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కేటింగ్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుతో పాటు ఆటల్లో రాణించడం వల్ల పిల్లలు ఏ సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోగలరని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:46 PM IST

మల్లేశ్వర స్వామి ఆలయానికి విరాళం అందజేత

GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విజయవాడ భాస్కరరావు ఆదివారం రూ. 50 వేల విరాళం అందజేశారు. ఆలయ ఉపకమిషనర్ లీలా కుమార్, పాలక మండలి ఛైర్మన్ పూర్ణచందర్రావు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి, నిత్య అన్నదానానికి భక్తులు విరాళాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. దాతకు ప్రత్యేక దర్శనం, శేషవస్త్రంతో సత్కరించారు.

February 22, 2026 / 06:46 PM IST

‘ఐక్యత కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి.. అబుల్ కలాం ఆజాద్’

MDK: హిందూ ముస్లింల ఐక్యత కోసం ఎంతగానో కృషి చేసిన మహోన్నత వ్యక్తి, విద్యావేత్త మౌలాన అబుల్ కలాం ఆజాద్ అని మున్సిపల్ ఛైర్మన్ కానుగు రాధిక పేర్కొన్నారు. ఆదివారం విద్యావేత్త, భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని  మెదక్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించారు.

February 22, 2026 / 06:45 PM IST

భారత్ నెట్‌తో ప్రభుత్వం ఒప్పందం

AP: భారత్ నెట్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. CM చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు MOUపై సంతకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్‌నెట్ లక్ష్యంగా ఒప్పందం.. డిజిటల్ సేవల విస్తరణకు భారత్ నెట్ సహకారం అందించనుంది.

February 22, 2026 / 06:44 PM IST

‘బడ్జెట్‌తో సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదు’

VZM: బడ్జెట్‌తో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు అన్నారు. ఆదివారం భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ పెట్టగా అందులో సామాన్య ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.

February 22, 2026 / 06:43 PM IST

విద్యార్థుల సృజనాత్మకత కోసమే టాలెంట్ టెస్ట్

BHNG: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి, వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు తెలిపారు. ఆదివారం ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలను రాయాలని రాజు సూచించారు.

February 22, 2026 / 06:43 PM IST

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

NZB: కమ్మర్‌పల్లి మండలంలోని కేసీఆర్ కాలనీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రోళ్ల లస్మయ్య (75) మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. లస్మయ్య ఎకైల్పై కమ్మర్ పల్లి నుంచి వెళ్తుండగా జాతీయ రహదారి-63పై అతని వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లస్మయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఎస్సై అనిల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 06:40 PM IST

IND vs SA: ప్లేయింగ్-11

IND: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తిSA: మార్‌క్రమ్(c), డికాక్(w), రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, మార్కో యాన్‌సన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, రబాడ, లుంగి ఎన్గీడి

February 22, 2026 / 06:38 PM IST

కుమ్మెర జాతరలో చిన్నారి మృతి.. సీపీఎం ఆగ్రహం

TG: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రెండేళ్ల దళిత చిన్నారి అనుమానాస్పద మృతిపై సీపీఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ స్పందించారు. చిన్నారి మృతి అత్యంత విషాదకరమని… చిన్నారి మృతిపట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తోందన్నారు. CM రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకుని.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 06:38 PM IST

‘రేపటి నుంచి యధావిధిగా ప్రజావాణి’

JGL: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి తిరిగి యథాతథంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

February 22, 2026 / 06:37 PM IST

విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేత

ELR: విద్యాభివృద్ధికి నా వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని రెవరెండ్ డి.చెల్లప్ప సుమా అన్నారు. ఆదివారం ఉంగుటూరులో యెహోవా యీరే మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్యాడ్, స్కేల్స్ పెన్నలు అందజేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు అందజేస్తున్న చెల్లప్ప సుమను పలువు అభినందించారు.

February 22, 2026 / 06:35 PM IST