MDCL: పార్కులు ప్రజల ఉమ్మడి ఆస్తి అని వీటిని కొనుగోలు చేయడం, విక్రయించడం రెండు చట్ట విరుద్ధమని నాచారం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ధనుంజయ తెలిపారు. మల్లాపూర్లోని బాబానగర్ కో-ఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో ప్రజల వినియోగానికి కేటాయించిన పార్కు స్థలాలను కబ్జా చేసిన బొట్ల సాయిలు అనే ప్రధాన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
SKLM: ఆమదాలవలస పట్టణంలో గల స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమదాలవలస టీడీపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త లుక్లో కనిపించాడు. కొత్త హెయిర్ స్టైల్, గడ్డం, ట్రెండీ డ్రెస్సింగ్లో సందడి చేశాడు. మిర్చి సినిమాలో ఉన్నట్లుగానే కనిపిస్తున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ప్రభాస్ కొత్త లుక్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ కోసమే ఈ స్టైల్ అని టాక్ వినిపిస్తోంది.
వనపర్తి మున్సిపల్ ఆఫీసులో నేడు ఉదయం 10 గంటలకు నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్, వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్ పదవి బాధ్యతలను స్వీకరిస్తారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బాధ్యులు తిరుపతయ్య తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా వార్డు నుంచి పార్టీ శ్రేణులు పాల్గొంటారన్నారు. ఇందిరాపార్క్ నుండి ర్యాలీతో మున్సిపల్ ఆఫీస్ కు చేరుకుంటారు అని తెలిపారు.
SRD: జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగే స్పాట్లను గుర్తించాలని చెప్పారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
KRNL: ఆదోని వన్ స్టాప్ సెంటర్లో 13 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఇవాళ వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 18-39 ఏళ్ల మధ్య ఉండాలని, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 24లోపు కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
NLR: ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు కావలి ట్రంక్ రోడ్డులోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపంలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
GNTR: గుంటూరు మిర్చి యార్డ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరగనుంది. నూతన ఛైర్మన్గా కుర్రా అప్పారావు, వైస్ ఛైర్మన్ బిట్రగుంట మల్లిక, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజ్జనగుండ్ల చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ ఏర్పాట్లను పెదకూరపాడు MLA భాష్యం ప్రవీణ్ గురువారం పర్యవేక్షించారు.
కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు, అల్ట్రా సౌండ్ కేంద్రాలను డీఎంహెచ్వో అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ తనిఖీ బృంద సభ్యులతో కలిసి నిన్న తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ & నర్సింగ్ హోమ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం-2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని సూచించారు.
పెద్దపల్లి పట్టణంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ధర్మారం, అంతర్గాం, ఎలిగేడు, జూలపల్లి, రామగిరి, ముత్తారం, మంథని మండలాల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి DPO వీర బుచ్చయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన నూతన సర్పంచులకు సూచించారు.
కృష్ణా: ఈనెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాల్ టికెట్లను నిన్న పంపిణీ చేశారు. కళాశాల ఇంఛార్జ్ సుధాకర్ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ కోర్సుకు చెందిన 98 మంది, వృత్తి విద్య కోర్సుకు చెందిన 60 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
RR: షాద్నగర్ పట్టణ పదవ వార్డు కౌన్సిలర్ శ్రావణిని సీఎస్కే విల్లాస్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై ఉంటూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళతానన్నారు.
KRNL: దేవనకొండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో రేపు ఉదయం 11 గంటలకు ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జ్యోతి ఇవాళ తెలిపారు. అన్నిశాఖల అధికారులు ప్రగతి నివేదికలతో రావాలని సూచించారు. అలాగే.. సమావేశానికి ప్రజాప్రతి నిధులు హాజరు కావాలని కోరారు.
ELR: పెదవేగి మండలంలోని కూచింపూడి విద్యుత్ ఉపకేంద్రం RDSS పథకం లైన్లు మెరుగుదల పనుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ అంబేద్కర్ గురువారం తెలిపారు. YSR బొమ్మ రోడ్డు, శూద్ర వారి మెట్టా, నాలుగు పంచాయతీ బోర్లు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
ASR: జీ.మాడుగుల మండలం గన్నేరుపుట్టులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 కుటుంబాలకు చెందిన కాఫీ, మిరియాల తోటలు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పాంగి సీతన్న, చిన్నమ్మి, భీమన్న, మఠం రాంబాబు అనే రైతులకు చెందిన సుమారు 4 ఎకరాల్లో ఉన్న కాఫీ, మిరియాల తోటల్లో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.