AP: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ముందుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్రమంత్రి జితిన్ ప్రసాదతో కలవనున్న ఆయన.. అనంతరం వారితోపాటు సమ్మిట్కు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలువురు విదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.
KDP: పులివెందుల పట్టణానికి చెందిన బాలిక(17) అదృశ్యమైనట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు SI తిమోతి తెలిపారు. SI వివరాల మేరకు.. బాలిక చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుమార్తె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
PPM: ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు హాజరు తక్కువగా ఉందని కండోనేషన్ ఫీజు వసూలు చేయాలని చూస్తే వారిపై చర్యలు తప్పవనిమన్యం DIEO వై. నాగేశ్వరరావు హెచ్చరించారు. కండోనేషన్ ఫీజు ఉన్న విద్యార్థులు కూడా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవచ్చునన్నారు. ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో 17,530 మంది పరీక్షలు రాయనున్నారు.
TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. కుటుంబకలహాల కారణంగా ముగ్గురిపై కత్తితో దాడి జరిగింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై రామ్దూత్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రంగా గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
CTR: కోకో పంటలు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 9 వేల హెక్టార్లలో కోకో పంట సాగులో ఉంది. నాణ్యతను బట్టి కిలోకు గరిష్టంగా రూ. 380 మాత్రమే లభిస్తున్నట్లు రైతులు తెలుపుతున్నారు. గత ఏడాది రూ. 650 వరకు ధర లభించిందని చెప్పారు. పంట సాగుకు పెట్టుబడులు అధికం కావడం.. గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నట్లు వాపోయారు.
SKLM: నరసన్నపేట పట్టణం తంబకాయ కూడలు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. తంబకాయ కూడలు వద్ద మలుపు ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడం వలన ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
ప్రకాశం: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గురువారం ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు పోలీసులు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల రక్షణార్థం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ ను ఉపయోగించి మహిళలు తమకు తామే రక్షణ కల్పించుకోవచ్చని పోలీసులు తెలిపారు. మహిళల స్మార్ట్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించి, దాని ఉపయోగాలను వారికి వివరించారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,000గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
TG: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ కీలక నేత జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత కొంత కాలంగా సొంత కాంగ్రెస్ పార్టీపైనే ఆయన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ను పరీక్షల విభాగం అధికారి ఉదయభాస్కర్ విడుదల చేశారు. ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయన్నారు.
SRD: సిర్గాపూర్ పీఎం పాఠశాతకు చెందిన విద్యార్థులు ఎక్స్ప్లోజర్ విజిట్ ఇండస్ట్రియల్ టూర్కు వొకేషనల్ విద్యార్థులు 50 మంది శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ICT గూగుల్ మైక్రోసాఫ్ట్ గచ్చిబౌలి (బాయ్స్), బ్యూటీ అండ్ వెల్నెస్ అను హెర్బల్ ఇండస్ట్రీ సుల్తాన్పూర్ ( గర్ల్స్) లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించనున్నట్లు PD తెలిపారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి రూ.1,56,170కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.1,43,150 పలుకుతోంది. అటు వెండి ధరలో నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. కిలో వెండిధర రూ.2,70,000ల వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
SRPT: పెన్పహాడ్ మండలంలోని ధర్మాపురం గ్రామంలో శుక్రవారం వింత ఘటన చోటుచేసుకుంది. స్థానిక మధిరామక్క చెరువులో నీటి కుక్క కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఉదయాన్నే ఈ వింత జీవిని చూసిన యువకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వార్త వైరల్గా మారింది. సముద్రాల్లో ఉండే జంతువు తమ చెరువులో కనిపించడంతో జనం ఎగబడ్డారు.
T20 WCలో అభిషేక్ ఆడిన 3 మ్యాచుల్లోనూ డకౌట్ కావడం అటు జట్టును, ఇటు క్రికెట్ అభిమానులను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అతనికి కీలక సూచన చేశారు. తొలి బంతికి బౌండరీ కోసం కాకుండా సింగిల్కు ప్రయత్నించాలని, ప్రారంభంలో పరుగులు చేయకున్నా క్రీజులో నిలబడాలని సూచించారు. ఒక్కసారి స్థిరపడితే రన్స్ సునాయాసంగా పరుగులు వస్తాయని పేర్కొన్నారు.
ATP: గుత్తి రైల్వే జంక్షన్లో శుక్రవారం తెల్లవారుజామున కదులుతున్న రైలులో చోరీ జరిగింది. బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాద్కు చెందిన అరుణ అనే మహిళ ప్రయాణికురాలి 3 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్ళాడు. ఈ ఘటనపై బాధితురాలు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.