పుదీనా ఆకు కేవలం సువాసనకే కాదు, ఆరోగ్యానికి ఒక వరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తూ తలనొప్పి, ఉబ్బసం, వికారం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులను తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నోటి దుర్వాసనను దూరం చేయడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పుదీనా ఒక ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది.
స్నేహితులు తగ్గిపోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బిజీ లైఫ్ స్టైల్, స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో ఫ్రెండ్ షిప్ ఆన్లైన్కే పరిమితమైంది. 1960ల్లో ఒక్కొక్కరికీ వందమంది స్నేహితులుంటే 1990 ప్రాంతంలో ఐదుగురికి, ప్రస్తుతం ఒక్కరికి పడిపోయింది. దేశంలో 15శాతం మందికి అసలు ఫ్రెండ్సే లేరు. దీనిని ‘ఫ్రెండ్ షిప్ రిసెషన్’ అంటారు. మరి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా?
మధ్యాహ్నం వేళ ఉత్సాహంగా ఉండటానికి ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి. భోజనం చేసిన వెంటనే నిద్రపోకుండా కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనానికి, నీటి వినియోగానికి మధ్య 30 నిమిషాల వ్యవధి ఉంచండి. ఎక్కువగా నూనె, మసాలా ఉన్న ఆహారం కంటే ఆకుకూరలు, పెరుగు తీసుకోవడం ఉత్తమం. ఇది మధ్యాహ్నం వచ్చే నీరసాన్ని తగ్గించి, మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచుతుంది.
మధ్యాహ్న భోజనంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఎండ వేడి నుంచి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, కాల్షియం శరీరానికి అంది ఎముకలు బలంగా ఉంటాయి. ఇది కడుపు నిండిన భావనను కలిగించి అతిగా తినకుండా చేస్తుంది. అయితే జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు మాత్రం పెరుగుకు దూరంగా ఉండటం మంచిది.
సహజమైన పూలతో చర్మ సౌందర్యాన్ని సులభంగా పెంచుకోవచ్చు. కలువ రేకులు, పాలు కలిపిన పేస్ట్ ముడతలను తగ్గిస్తుంది. గులాబీ రేకలు, శనగపిండి మిశ్రమం ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది. మల్లెపూల పేస్ట్తో మర్దనా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. రసాయనాలకు దూరంగా ఉంటూ, ఈ పూల చిట్కాలతో ముఖాన్ని తాజాగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. ప్రకృతి సిద్ధమైన ఈ పద్ధతులు చర్మానికి సురక్షితం.
నేటి యాంత్రిక జీవనంలో గంటల తరబడి కూర్చొని పని చేయడం ప్రాణాంతకమవుతోంది. ఎక్కువ సేపు కూర్చోవడంతో కదలిక లేకపోవడం వల్ల రక్తప్రసరణ మందగించి గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అందుకే ఎంత పని ఉన్నా గంటకోసారి సీటు నుంచి లేచి, కనీసం 2 నిమిషాలు నడవాలి. ఈ చిన్న అలవాటు రక్తప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు శారీరక శ్రమను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు సూర్యుడిలా ప్రకాశిస్తారని విదురుడు ధృతరాష్ట్రుడికి వివరించాడు. ‘ఎదుటివారిని శిక్షించే సామర్థ్యం ఉండి కూడా, కోపాన్ని అణచుకుని క్షమించే వ్యక్తి. అలాగే తన దగ్గర చాలా తక్కువ వనరులు ఉన్నా, ఇతరుల కష్టాన్ని చూసి చలించి తనకున్న దానిలోనే దానం చేసే పేదవాడు. ఈ ఇద్దరికీ దైవత్వం సిద్ధిస్తుంది, సమాజం వీరిని ఎప్పటికీ స్మరించుకుంటుంది’ అని విదురుడు చెప్పాడు.
కరివేపాకును కేవలం పోపులో వాడి పక్కన పడేయకుండా, పొడి రూపంలోనో లేదా పచ్చిగానో తీసుకోవడం వల్ల జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది. ఇందులో ఉండే బీటా-కెరోటిన్, ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బాదం పప్పులను నేరుగా తినడం కంటే, రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం పొట్టులో ఉండే ‘టానిన్’ అనే పదార్థం, పోషకాలను మన శరీరం సరిగ్గా గ్రహించకుండా అడ్డుకుంటుంది. పొట్టు తీసి తినడం వల్ల విటమిన్-E, ప్రోటీన్లు ఒంటికి బాగా పడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. అలాగే, జ్ఞాపకశక్తిని పెంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పచ్చి పాలు తాగొద్దని, చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ పాలు అయినా సరే పచ్చిగా తాగటం గాని, పాశ్చరైజ్ చేయకుండా ముట్టుకోవద్దని తెలిపారు. పచ్చి పాలల్లో సూక్ష్మ క్రిములు ఉంటాయని చెప్పారు. ఇళ్లలో బర్రెల నుంచి తీసిన పాలల్లోనూ సూక్ష్మ క్రిములు ఉంటాయని, అందువల్ల వేడి చేసుకుని తాగాలని సూచించారు.
గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చునేవారు ప్రతి గంటకోసారి చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. మెడను నెమ్మదిగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిశల్లో తిప్పడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. భుజాలను గుండ్రంగా తిప్పడం వల్ల మెడ కండరాలపై భారం తగ్గుతుంది. అలాగే భుజాలను పైకి, కిందకి కదల్చాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.
బియ్యప్పిండి చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. తేమను పోనివ్వకుండానే మృతకణాలను, జిడ్డును తొలగిస్తుంది. స్పూన్ బియ్యప్పిండి, తేనె కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే మంచి స్క్రబ్లా పనిచేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు బియ్యంపిండికి తగినంత పెరుగుతో కలిపి వాడాలి. బియ్యప్పిండి, ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ప్యాక్లా వేస్తే జిడ్డు తగ్గుతుంది.
మధ్యాహ్నం భోజనం తర్వాత వచ్చే నీరసం, మగతను వదిలించుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. తిన్న వెంటనే నిద్రపోకుండా పది నిమిషాల పాటు నడవడం ఉత్తమం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు తాగాలి. ఒకేసారి అతిగా తినకుండా, తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. అలాగే రాత్రిపూట కంటినిండా నిద్ర ఉంటే మరుసటి రోజు ఉత్సాహంగా ఉండొచ్చు.
గ్రీన్ టీ బెల్లీ ఫ్యాట్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కాటెచిన్స్, కెఫీన్ మెటబాలిజంను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, కేవలం గ్రీన్ టీ తాగడం వల్ల మాత్రమే బరువు తగ్గరు. దీంతో పాటు సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్ సంభవిస్తుంది. ఇలాంటి సమయంలో తీవ్రమైన దాహం, నోరు ఆరిపోవడం, తలనొప్పి, అలసటగా అనిపిస్తుంది. మూత్రం ముదురు పసుపు రంగులో రావడం డీహైడ్రేషన్కు ప్రధాన సంకేతం. అలాగే చర్మం పొడిబారడం, కళ్లు లోతుకు వెళ్లడం, మలబద్ధకం వంటివి కనిపిస్తాయి. తగినంత నీరు లేదా ORS తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది.