• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అత్యాచార నిరోధక చట్టం అమలు చేయాలి’

KRNL: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలును అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని జేసి నూరుల్ ఖమర్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పలు అంశాలపై జేసీ అధికారులతో చర్చించారు. ఇందులో హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు, పత్తికొండ RDOలు సందీప్, భరత్ ఉన్నారు.

February 20, 2026 / 02:19 PM IST

పోలీసుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అసెంబ్లీలో పోలీసు శాఖ సమస్యలపై ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించారు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న పని భారం, సిబ్బంది కొరత, మౌలిక వసతుల లోపాలు వంటి అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులకు తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

February 20, 2026 / 02:19 PM IST

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన

BPT: కర్లపాలెం మండలం ఎంవీరాజుపాలెంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కొనసాగుతుంది. ఈ మేరకు ఇవాళ సర్వేను బాపట్ల ఆర్డీవో గ్లోరియా, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీదేవి పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి సర్వే నమోదు విధానాన్ని పరిశీలించారు. కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.

February 20, 2026 / 02:16 PM IST

కోటూరులో రాష్ట్ర స్థాయి పూటీ లాగుడు పోటీలు

కృష్ణా: కోడూరులో రాష్ట్రస్థాయి పూటీ లాగుడు బల ప్రదర్శన(పోటీలు) నిర్వహిస్తున్నట్లు పసుపులేటి రాము (దాణాకొట్టు) అన్నారు. కోడూరు శివారు స్వతంత్రపురం గవర్నమెంట్ హాస్పటల్ సమీపంలో పూతబోయన వెంకయ్య స్థలంలో మార్చ్ 8వ తేదీ పూటీ ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కావున ఆసక్తిగల ఎడ్ల యజమానులు మార్చ్ 1వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 02:16 PM IST

గ్రామాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: సొంటెన్న

KRNL: కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని టీడీపీ గ్రామ అధ్యక్షులు బోయ సొంటెన్న, బూత్ ఇన్ ఛార్జ్ దుమ్మల శివ, నాయకులు రామలింగ, నరసయ్య స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడబూరు మండలం హెచ్ మురవణి గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పని చేయాలన్నారు.

February 20, 2026 / 02:15 PM IST

‘రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలి’

VZM: ప్రతిఒక్కరూ విధిగా తమ విధులు బాధ్యతలను తెలుసుకోవాలని గజపతినగరం జడ్జి ఏ.విజయ రాజ్‌ కుమార్‌ సూచించారు. శుక్రవారం స్దానిక బోడసింగిపేటలో ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఆవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలని చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 02:10 PM IST

సైబర్ నేరగాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై

KDP: ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ముద్దనూరు ఎస్సై ఎన్. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ముద్దునూరు మండలం కండ్లోపల్లి గ్రామంలో సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా అనుమాన వ్యక్తులు కనబడితే 112కి సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.

February 20, 2026 / 02:10 PM IST

విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న పరిటాల శ్రీరామ్

సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం మల్లాకాల్వ గ్రామంలో నిర్వహించిన లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో జరిగిన ప్రతిష్ఠాపన వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

February 20, 2026 / 02:07 PM IST

మదనపల్లిలో రూ. 60 లక్షల భూ అగ్రిమెంట్ వివాదం

అన్నమయ్య: మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు, డీకే తేజస్విని పేరుపై ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్ముతామని చెప్పి రూ.60 లక్షలకు అగ్రిమెంట్ చేసుకుని మోసం చేశారని శుక్రవారం బాధితుడుఆరోపించారు. కే. అమర్నాథ్ 2022 నుంచి డబ్బు విషయంలో ఇబ్బందులు పెడుతున్నాడని, డబ్బు అడిగితే రౌడీలతో బెదిరిస్తున్నాడని వాపోయారు.

February 20, 2026 / 02:05 PM IST

అమరావతికి మణిహారంగా ఇన్నర్ రింగ్ రోడ్డు

GNTR: రాజధానిలో రూ.40,847 కోట్ల భారీ వ్యయంతో ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. 96.2 కిలోమీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రూపొందుతున్న ఈ రహదారిని 8+4 వరుసలుగా డిజైన్ చేశారు. ఇందులో ప్రధాన ప్రయాణం కోసం 8 వరుసల రహదారి ఉండగా, స్థానిక రవాణా అవసరాల కోసం అదనంగా మరో 4 వరుసల సర్వీస్ రోడ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

February 20, 2026 / 02:05 PM IST

ఆంజనేయస్వామి ప్రతిష్టలో పాల్గొన్న తెలుగు యువత అధ్యక్షులు

SKLM: సారవకోట(మం) తల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో శుక్రవారం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాస్ నాయుడు పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం దాస్ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.

February 20, 2026 / 02:04 PM IST

ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు

VSP: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. 85 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు మొత్తం 81,001 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కేంద్రాల వద్ద బందోబస్తు, 144 సెక్షన్ అమలు, వైద్య శిబిరాలు, తాగునీరు, అదనపు బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

February 20, 2026 / 02:01 PM IST

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

కృష్ణా: పార్లమెంట్‌లో నిర్వహించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం పాల్గొనారు. ఈ సమావేశంలో స్కిల్ ఎక్కువైజేషన్ నాలెడ్జ్ అవేర్నెస్ లైవ్లీహుడ్ ప్రమోషన్ కార్యక్రమానికి సంబంధించి విధి నిర్వహణ కమిటీపై కమిటీ సభ్యులతో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

భారతి సిమెంట్స్ వద్ద ఉద్రిక్తత

కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూములు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్థులు ఆందోళనకు దిగగా, జీతాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.

February 20, 2026 / 02:01 PM IST

‘హిందూ దేవతలను అవమానించడమే వైసీపీ లక్ష్యం’

E.G: వైసీపీ శాసనమండలి సభ్యులు, మాజీ సీఎం జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వెంటనే వారు క్షమాపణ చెప్పాలని నిడదవోలు MLA, మంత్రి కందులు దుర్గేష్ శుక్రవారం డిమాండ్ చేశారు. శాసనమండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ, స్వామి వారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ దేవతలను అవమానించడమే వైసీపీ లక్ష్యం అని మంత్రి అన్నారు.

February 20, 2026 / 02:01 PM IST