• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భాషా పండిట్లకు అప్ గ్రేడ్ ఉత్తర్వులు ఇవ్వాలి

పార్వతీపురం ఐటీడీఏలో భాషా పండిట్లకు అప్ గ్రేడ్ ఉత్తర్వులు ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భాషా పండిట్లకు పాఠశాల సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కానీ పార్వతీపురం ఐటీడీఏలో ప్రక్రియ ముందుకు సాగడం లేదని అన్నారు.

February 20, 2026 / 03:26 PM IST

బీసీ వెల్ఫేర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

BPT: నిజాంపట్నం బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ (MPC, BiPC, CEC) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయన్ని ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ సీట్లను కూడా భర్తీ చేసున్నామని వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:22 PM IST

అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆందోళన

నంద్యాల జిల్లా డోన్ పట్టనంలో డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం సీపీఐ నాయకులు సామాజిక న్యాయం కోసం ఆందోళన నిర్వహించారు. కార్పొరేట్ సంపదను పునర్పంపిణీ చేయాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ లింగ వివక్షను నివారించాలని, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సమానంగా కల్పించాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 03:20 PM IST

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

చిత్తూరు నగరపరిధిలోని పలు వార్డుల్లో రూ. 49.35 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ప్రారంభించారు. మిట్టూరులో సిమెంటు రోడ్లు, కాలువలు, పంట్రాంపల్లిలో నూతన బోరు, మోటారును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, స్థానిక టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 03:18 PM IST

‘రానున్న MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తాం’

KRNL: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. శుక్రవారం ప్రత్యేక జిల్లా హోదా ప్రకటించే వరకు తమ ఓటు వేయబోమని పలువురు గ్రామస్తులు హెచ్చరించారు. రానున్న సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆదోనికి జిల్లా హోదా కల్పించాలని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

February 20, 2026 / 03:12 PM IST

ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్

అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఉద్యోగం నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడవ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిష్కారానికి అవకాశం గల ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

February 20, 2026 / 03:12 PM IST

మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు

గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్‌కు నూతన ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంతకం చేసి పదవిని చేపట్టారు. “చిల్లి సిటీ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు పొందిన మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఈ సందర్భంగా అప్పారావు పేర్కొన్నారు.

February 20, 2026 / 03:11 PM IST

‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి చేయాలి’

ప్రకాశం: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను సమగ్రంగా పర్యవేక్షించాలని ఎంపీడీవో వీరభద్రాచారి సూచించారు. శుక్రవారం ఆయన కంభం పట్టణంలోని ఫ్యామిలీ సర్వేను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.పెండింగ్‌లో ఉన్న వివరాలను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:10 PM IST

బాలికల పాఠశాలలో ట్రాఫిక్‌పై అవగాహన

TPT: ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిబ్బంది విద్యార్థినులకు హెల్మెట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు సంకేతాలు, మైనర్లు వాహనాలు నడపరాదనే చట్టాలపై వివరించారు. మొబైల్ వినియోగం, ప్రమాదాలపై హెచ్చరించారు.

February 20, 2026 / 03:01 PM IST

మసీదులో రంజాన్ మాస ప్రత్యేక ప్రార్థనలు

ATP: రంజాన్ మాసంలో వచ్చే తొలి శుక్రవారం (జుమా) నమాజ్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇందులో భాగంగా గుత్తి కేబీఎన్ మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదు ఇమామ్ హుస్సేన్ మాట్లాడుతూ.. రంజాన్ ప్రాముఖ్యత, ఉపవాసం, దానధర్మాలు ఆధ్యాత్మికత గురించి ప్రత్యేక ఉపన్యాసాలు చేశారు. నమాజ్‌కు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు.

February 20, 2026 / 03:01 PM IST

రమణీయంగా సాగిన రథోత్సవం

NLR: బుచ్చి పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లకు రథోత్సవం వేడుకగా జరిగింది. రథం లాగేందుకు యువత పోటీ పడ్డారు. అడుగడుగునా స్వామి అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు.

February 20, 2026 / 03:00 PM IST

శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

విజయనగరం స్థానిక పూల్ బాగ్ కాలనీలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ అయోధ్య బాలక్ రామ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు ఆధ్వర్యంలో అర్చకులు వేకువ జామున సుప్రభాతసేవ, శాంతి హోమం, పూర్ణాహుతి, పూజలు జరిపారు. అనంతరం అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

February 20, 2026 / 03:00 PM IST

విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి

సత్యసాయి: హిందూపురం నియోజకవర్గంలోని సడ్లపల్లిలో శ్రీ సూగూరు సీతారామాంజనేయ స్వామి నూతన విగ్రహవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పాల్గొని పూజలు నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు.

February 20, 2026 / 03:00 PM IST

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

KDP: బద్వేల్‌లోని పేదలు, కూలీలు నిత్యం ప్రయాణించే వారి ఆకలి తీర్చడమే ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుత పథకం ‘అన్న క్యాంటీన్’ అని అన్నారు. అతి తక్కువ ధరకే, అత్యంత నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని గౌరవప్రదమైన రీతిలో అందిస్తూ వేలాది మంది కడుపు నింపుతోందని మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పేర్కొన్నారు. శుభ్రత, నాణ్యత, ధరలను తనిఖీ చేశారు.

February 20, 2026 / 02:59 PM IST

‘మత, లింగ వివక్షతను నిర్మూలించడానికి కృషి చేయాలి’

KRNL: అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఆస్పరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి మాట్లాడుతూ.. సామాజిక, ఆర్ధిక, రాజకీయ అసమానతలను తీర్చడానికి, కుల, మత, లింగ వివక్షతను నిర్మూలించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.

February 20, 2026 / 02:59 PM IST