• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్థల వివాదం ఘటనలో ఒకరిపై కేసు నమోదు: ఎస్ఐ

ATP: పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో సోమవారం జరిగిన స్థల వివాదంతో నాగన్న అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటనలో ముత్యాలు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. బుధవారం ఎస్ఐ మీడియాతో మాట్లాడారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు.

February 25, 2026 / 04:03 PM IST

మంగళగిరిలో శరవేగంగా అభివృద్ధి పనులు

GNTR: మంత్రి లోకేష్ కృషితో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆత్మకూరులో కోకాకోలా సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ.35 లక్షలతో పలు పనులు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలు 52, 53, 54లను ఆధునీకరించి, 62వ కేంద్రానికి స్మార్ట్ టీవీ అందించారు. జెడ్పీ హైస్కూల్‌కు కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, క్రీడా దుస్తులు అందజేశారు.

February 25, 2026 / 04:02 PM IST

‘రామాలయ అభివృద్ధికి సహకరించాలి’

VZM: పోలిపల్లి పైడితల్లి అమ్మవారి పండగను రాష్ట్ర పండగగా ప్రకటించినందుకు అసెంబ్లీలో రాజాం MLA కొండ్రు మురళీమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాజాంలోని గుళ్లసీతారాంపురంలోని 150 సంవత్సరాల చరిత్ర గల రామాలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. పట్టణంలో, సారధి గ్రామంలో రైతులకు సంబంధించి 70 ఎకరాల భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు.

February 25, 2026 / 04:02 PM IST

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

BPT: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను గడువులోగా పూర్తి చేసి, వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన స్పష్టం చేశారు.

February 25, 2026 / 04:00 PM IST

పమిడిముక్కలలో ఉచిత క్యాన్సర్ శిబిరం

కృష్ణా: గ్రామీణ ప్రజలు ముందస్తు కాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని టిడిపి నేత వర్ల చైతన్య అన్నారు. బుధవారం పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పేర్కొన్నారు.

February 25, 2026 / 04:00 PM IST

పారిశుద్ధ పనులను తనిఖీ చేసిన జడ్పీ సీఈఓ

ATP: వజ్రకరూరు గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జడ్పీ సీఈవో శివశంకర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, మండల సమస్యలపై ఎంపీడీవోతో చర్చించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని గ్రామ సర్పంచ్ మోనాలిసాకు సూచించారు.

February 25, 2026 / 03:58 PM IST

మార్చి 3న జొన్నవాడ కామాక్షమ్మ ఆలయం మూసివేత

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ స్వామి అమ్మవార్ల దేవస్థానాన్ని మార్చి మూడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయునున్నారు. ఆరోజు ఉదయం ఆర్జిత సేవలు అనంతరం 10 గంటల తర్వాత ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. సంప్రోక్షణ అనంతరం నాలుగవ తేదీ యధావిధిగా దర్శనం కల్పిస్తామన్నారు.

February 25, 2026 / 03:57 PM IST

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: గుత్తి ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ స్వాతి బుధవారం తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయని వివరించారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 03:50 PM IST

మామిడితోటల సంరక్షణకు సూచనలు

ELR: నూజివీడు(మం) సుంకొల్లు, సిద్ధార్థనగర్‌లలో మామిడి తోటలను ఉద్యాన అధికారులు బుధవారం పరిశీలించారు. శాస్త్రవేత్త కే. రాధా రాణి మాట్లాడుతూ.. మామిడి పూత పిందె కట్టి నిలిచేందుకు 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఆర్. హేమ, రైతులు పాల్గొన్నారు.

February 25, 2026 / 03:48 PM IST

చింత సుజనా కుమారి చిత్రపటానికి శ్రద్ధాంజలి

అన్నమయ్య: ఓబులువారిపల్లి(మం) ముక్కవారిపల్లి పంచాయతీ సంజీవపురం గ్రామానికి చెందిన చింత సుజనా కుమారి పెద్దకర్మకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంఛార్జ్ & KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, వారి సతీమణి ముక్కా వరలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

February 25, 2026 / 03:42 PM IST

రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేయాలంటూ 27న నిరసన

కడప నగరంలోని ఎర్రముక్కపల్లి–విశ్వనాధపురం మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఈనెల 27న నిరసన ప్రదర్శన చేపట్టనుంది. ఉదయం 10 గంటలకు విశ్వనాధపురం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు కన్వీనర్ నాగేళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిధుల విడుదలలో జాప్యంపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

February 25, 2026 / 03:41 PM IST

తిరుపతిలో మహిళ, బాలిక అదృశ్యం

తిరుపతిలోని ఆటోనగర్‌కు చెందిన అశాలత, ఆమె మనవరాలు దుర్గా అదృశ్యమైనట్లు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ తిరిగి రాలేదని తల్లి నాగరత్నం ఫిర్యాదులో పేర్కొన్నారు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

February 25, 2026 / 03:37 PM IST

‘సోలార్ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలి’

NDL: జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ జీ. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూఫ్‌టాప్ సోలార్ (RTS) ప్లాంట్ల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణ సౌకర్యాల వివరాలను స్పష్టంగా తెలపాలన్నారు.

February 25, 2026 / 03:36 PM IST

మార్కాపురానికి బయలుదేరిన CM చంద్రబాబు

ప్రకాశం: దోర్నాల మండలం గంటవానిపల్లి వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ను సందర్శించిన అనంతరం హెలిప్యాడ్‌లో మార్కాపురానికి బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని తర్లుపాడు రోడ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారి రావడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

February 25, 2026 / 03:35 PM IST

ఉర్దూ పాఠశాలలో ‘ధైర్య స్పర్శ’పై అవగాహన కార్యక్రమం

CTR: పలమనేరు ఎస్సై స్వర్ణ తేజ ఉర్దూ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో “ధైర్య స్పర్శ”, మహిళలపై నేరాలు, మహిళా భద్రతా చర్యలు, డయల్ 112 అత్యవసర సేవల వినియోగం, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

February 25, 2026 / 03:32 PM IST