KRNL: మంత్రాలయంలో MPDO నూర్జహాన్, MRO రమాదేవి ఆధ్వర్యంలో మంచాల సొసైటీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి ఇవాళ ‘స్వచ్ఛరథం’ వాహనాన్ని ప్రారంభించారు. ఈ వాహనం గ్రామాల్లో ప్లాస్టిక్, స్క్రాప్ వంటి వ్యర్థాలను సేకరించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుందని పేర్కొన్నారు. ‘శుభ్రమైన మండలం-అభివృద్ధి చెందిన మంత్రాలయం’ లక్ష్యంతో ఈ పనులకు శ్రీకారం పుట్టినట్లు పేర్కొన్నారు.
KKD: SP బిందుమాధవ్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా SP మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీకి ఉన్న మాజీ సీఎం డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మార్చడం దారుణమని వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. శనివారం ANUలో VC గంగాధరరావును కలిసి వినతిపత్రం ఇచ్చి, 2009 పాలకమండలి తీర్మానాన్ని గౌరవించాలని కోరారు.
GNTR: కృష్ణానగర్ 1వ లైన్లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి 80వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శనివారం హయగ్రీవ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుల కల్యాణం వైభవంగా జరిగింది. విష్ణుసహస్రనామ పారాయణ, గరుడ వాహనంపై తిరువీధి ఉత్సవం భక్తులను ఆకట్టుకుంది.
AKP: ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో 27 మందికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం స్థానిక జడ్పీ అతిథిగృహంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వీరికి రూ.13.76 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారికి తన సిఫారసు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయిందన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
W.G: తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామం విశాల సహకార పరపతి సంఘ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం శనివారం జరిగింది. నూతన అధ్యక్షులుగా అబ్బిన వీర వెంకటరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి మాట్లాడారు. సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
CTR: ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 4వ వార్డు కట్టమంచి లాయర్స్ కాలనీలో రూ. 19.30 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సిమెంట్ కాలువలను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. లాయర్స్ కాలనీ ఎక్స్టైన్షన్కు“వెంకటరమణ నగర్”గా నామకరణం చేసి ఆవిష్కరించారు.
కోనసీమ: దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేస్తోంది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, పుదుచ్చేరిలోని యానాం ప్రాంతానికి ఎ. తోట రాజును పార్టీ ఇన్ఛార్జ్గా నియమించింది.
E.G: కడియం మండలం వేమగిరిలో నిర్మించిన శ్రీ ప్రసన్న లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టాపనకు ఆలయ కమిటీ పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. మంత్రి కందుల దుర్గేష్, MLAలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బల రామకృష్ణ, MLC సోము వీర్రాజు, తదితరులకు శనివారం ఆహ్వాన పత్రికలు అందించారు. ఈనెల 26న ఆలయ ప్రతిష్టాపన జరుగుతుందన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక వాహబ్ పేట, ఉమామహేశ్వరి శివాలయం ప్రాంతంలో జరుగుతున్న యెల్లి కాలువ అభివృద్ధి పనులను శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. కాలువ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలన్నారు. పనులు నాణ్యతతో జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో శనివారం మాతృభాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మా తెలుగు తల్లి చిత్రపటానికి కోశాధికారి జన్నే కుల్లయ్య బాబు, సెక్రెటరీ రామ్మోహన్ పూలమాల వేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ‘దేశ భాషలందు తెలుసు లెస్స’ అని శ్రీకృష్ణదేవ రాయలు అన్న విషయాన్ని గుర్తు చేశారు.
KRNL: ఈనెల 23న కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తామని చెప్పారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయాలని, meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని ఆమె వెల్లడించారు.
కృష్ణా: నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెనుమూరు మండలం తాడిగడప కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జరిగిన జాబ్ మేళాలో యువకులు ఈరోజు ఉత్సాహంగా పాల్గొన్నారు. నేటి యువతీ యువకులు చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని నిరుత్సాహ పడకుండా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రకాశం: కంభంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి పరిసరాల పరిశుభ్రతపై సిబ్బందికి అవగాహన కల్పించారు. శుభ్రమైన వాతావరణం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
SKLM: పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తత, సమన్వయం ఎంతో కీలకమని జిల్లా పరిశ్రమల సంయుక్త తనిఖీ అధికారి శివశంకర్ అన్నారు. శనివారం పైడి భీమవరం సరగడపేటలో పరిశ్రమల్లో విషవాయువు లీకేజీ అయినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలో అనే దాని పై మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు నిర్వహణ అధికారి రాము, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహనరావు ఉన్నారు.