ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపీ మేస్త్రి కాలనీలో సీఐ అశోక్ కుమార్ శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. సరైన పత్రాలు లేని వాహనాలను కొనుగోలు చేస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో 8 ప్రత్యేక బృందాలతో కలిసి తనిఖీలు నిర్వహించామన్నారు.
E.G: రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయం వద్ద శుక్రవారం ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ, యానాపు ఏసు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, చెరువుల ఆక్రమణ, పింఛన్ల తదితర సమస్యలపై పలు వినతులు వచ్చాయి. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాల్మీకి వీధికి చెందిన రైతు లక్ష్మీనారాయణ (57) తీవ్రంగా గాయపడ్డారు. బస్సు స్కూటర్ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే ఆయనను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం నుంచి కోలుకుంటున్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం: గాలివీడులో ఈ నెల 17న జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరే ఈ హత్యకు కారణమని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. నిందితులు ప్రొద్దుటూరు, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాధ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ATP: రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న భం షేక్ అబ్దుల్ వహబ్ 57వ ఉరుసు ఉత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ఆలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు. మార్చి 1వ తేదీన గంధం కార్యక్రమం, రెండవ తేదీన చిత్రపటం ఊరేగింపు, దీపారాధన, మూడవ తేదీన షంషీర్ బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వభక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.
కోనసీమ: ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో పితాని బాలకృష్ణ (51) అనే వ్యక్తి భవనం పైనుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయారు. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా పిట్టగోడపై ఇటుకలు అందిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్సై జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా: కంకిపాడులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో SP విద్యాసాగర్ నాయుడు, సంయుక్త కలెక్టర్ గురువారం సాయంత్రం శుక్రవారం ఏర్పాట్లును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలించి, సీఎం ప్రయాణించే ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అదనపు SP సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, DSPలు శ్రీనివాసరావు, CI పాల్గొన్నారు.
VSP: గాజువాక బెల్ కంపెనీ ఎదురుగా ఉన్న మైదానంలో లారీ డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. తమిళనాడుకు చెందిన విజ్జి అనే లారీ డ్రైవర్ బెల్ కంపెనీకి లోడ్తో వచ్చారు.. సమీపంలో ఉన్న మైదానంలో ఆయన ఉరివేసుకున్నారు. అయితే ఆత్మహత్యలు గల కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియ రాలేదు.
NTR: అవనిగడ్డ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న అవనిగడ్డ డిపో RTC బస్సును, మచిలీపట్నం నుంచి వస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వసమైంది. ఢీకొన్న సమయంలో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు.
GNTR: ఆయేషా మీరా శరీర అవశేషాలను తిరిగి ఖననం చేయనున్న నేపథ్యంలో తెనాలిలోని ఈద్గా వద్ద పోలీసులు భద్రతను పెంచారు. విజయవాడ సీబీఐ కోర్టు నుంచి అవశేషాలను స్వీకరించిన తల్లిదండ్రులు, నేడు మధ్యాహ్నం తెనాలి చెంచుపేటలోని ఖబరస్థాన్కు చేరుకుంటారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు ‘చలో తెనాలి’ పిలుపునిచ్చాయి.
కర్నూలులో 10వ రక్షణ దళాల వెటరన్స్ డే సందర్భంగా శనివారం ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారి శివ హరి నాయక్ తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టీజీ లక్ష్మి కళ్యాణ మండపం నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాజీ సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు వేగవంతమైంది. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని 9.84 ఎకరాల భూమిని 25 ఏళ్ల లీజుకు ఇస్తూ అనుమతులు లభించాయి. కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ మద్దతుతో తొలి విడతగా రూ. 298.03 లక్షలు విడుదలయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా డిజైన్ స్టూడియో, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించనున్నారు.