• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైఎస్సార్ కాలనీలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు

SS: ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. దేవాలయ భక్త సేవా మండలి, అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

February 26, 2026 / 12:32 PM IST

నరసరావుపేటలో తప్పిపోయిన బాలుడు

PLD: నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా తిరుగుతున్న ఒక బాలుడిని స్థానికులు గమనించి గురువారం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ బాలుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో భద్రంగా ఉన్నాడని సీఐ ఫిరోజ్ తెలిపారు. బాలుడు వివరాలు చెప్పలేకపోతున్నాడని, ఈ బాలుడి వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.

February 26, 2026 / 12:30 PM IST

‘చంద్రబాబుతోనే గ్రామ సుపరిపాలన సాధ్యం’

KRNL: సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరు మండలం చిన్నతుంబళంలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణానికి టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.

February 26, 2026 / 12:30 PM IST

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు మృతి

NDL: కొత్తపల్లి మండలం ఎర్ర మఠంకు చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు వెంకట్ రెడ్డి క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలిసిన బైరెడ్డి వెంకట్ రెడ్డి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

February 26, 2026 / 12:25 PM IST

రెవెన్యూ సిబ్బందికి వైద్య పరీక్షలు

W.G: నరసాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెవెన్యూ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల శిబిరాన్ని నరసాపురం ఆర్డీవో దాసిరాజు గురువారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు.

February 26, 2026 / 12:20 PM IST

‘అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల డిమాండ్స్ సమంజసం’

KDP: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల డిమాండ్లు సమంజసమని, వాటిని ఆలస్యం చేయకుండా పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7,000 మాత్రమే వేతనం ఇవ్వడం అన్యాయమన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.

February 26, 2026 / 12:20 PM IST

‘కార్మికులకు ద్రోహంచేసే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి’

E.G: రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడి వర్కర్లు & హెల్పర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం కొనసాగాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ద్రోహం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాడ్యూటీ అమలు చేయాలని, వేతనాలతో కూడిన మెడికల్ లీవ్ లు ఇవ్వాలన్నారు.

February 26, 2026 / 12:20 PM IST

ఎంపీపీ పాఠశాలను సందర్శించిన ఎంఈవో

VZM: వేపాడ మండలం దబ్బిరాజుపేట ఎంపీపీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి పీ బాల భాస్కరరావు గురువారం సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు వారితో చతుర్విధ ప్రక్రియలు చేయించారు. ఎఫ్ ఎల్ ఎన్ మెటీరియల్ వినియోగించే తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.

February 26, 2026 / 12:19 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారిలోని భాకరాపేట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొనడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలై కాలు నుజ్జునుజ్జు అయింది. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 12:14 PM IST

ఆదోని ముస్లిం సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన

KRNL: ఆదోని ముస్లిం మైనార్టీల సమస్యలను ఎమ్మెల్యే పార్థసారథి గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. అరేకల్లు వద్ద రూ.18 కోట్లతో నిర్మించిన బాలికల రెసిడెన్షియల్ స్కూల్, రూ.3.69 కోట్ల ఐటీఐ కాలేజ్ వినియోగం లేకుండా ఉన్నాయన్నారు. ఉర్దూ జూనియర్ బాలికల కళాశాల అర్ధాంతరంగా నిలిచిపోయాయని విమర్శించారు. గత ప్రభుత్వం ఈద్గా కోసం రూ.2.60 కోట్లు తెచ్చామని మోసం చేసిందన్నారు.

February 26, 2026 / 12:10 PM IST

‘జీడిపెక్కలకు మద్దతు ధర కల్పించాలి’

AKP: రావికమతం మండలం కొమిర గిరిజన రైతులు జీడిపిక్కలకు కిలో రూ.200 మద్దతు ధర నిర్ణయించాలని ఇవాళ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది రైతులు జీడితోటలపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా జీడిపిక్కలను కొనుగోలు చేయడంతో పాటు ఉపాధి పనులు, రోడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.

February 26, 2026 / 12:08 PM IST

కోవెలకుంట్లలో పెరుగుతున్న కాపర్ వైర్ చోరీలు

NDL: కోవెలకుంట్ల మండలంలో విద్యుత్ మోటార్లు ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ చోరీలు పెరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుందూ నది వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం చేసి 50 కిలోల కాపర్ వైర్ ఎత్తుకెళ్లినట్లు సీఐ హనుమంతు నాయక్ వెల్లడించారు. ఈ దొంగతనాల పట్ల నిఘా పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 26, 2026 / 12:02 PM IST

జిల్లాలో మొట్టమొదటి హైడ్రోజన్ ప్రాజెక్ట్

AKP: దేశంలోనే మొట్టమొదటి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. గురువారం శాసనసభలో మంత్రి మాట్లాడుతూ.. దీని ద్వారా లక్షలాదిమందికి ఉపాధి కలుగుతుందన్నారు. నక్కపల్లి మండలంలో వచ్చే నెల 7వ తేదీన ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

February 26, 2026 / 12:00 PM IST

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

పార్వతీపురం పట్టణ ప‌రిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వ‌ద్ద గల ఈవీఎం గోదామును క‌లెక్టర్ N.ప్రభాకరరెడ్ది త‌నిఖీ చేశారు. నెల వారీ త‌నిఖీలో భాగంగా ఇవాళ ఆయ‌న గోదాములను సంద‌ర్శించారు. గోదాములకు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో DRO హేమలత, తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 12:00 PM IST

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ

ATP: జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటూ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లో 2026-27 సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. తొలి విడతలో 607 కార్డులను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

February 26, 2026 / 12:00 PM IST