• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆదర్శపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

SKLM: ఆదర్శపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO ఏ. రవి బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న13 ఆదర్శ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశం కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆయా మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు జరుగుతాయిన్నారు. https://www.cse.ap.gov.in/apmలో చూడవచ్చని తెలిపారు.

February 20, 2026 / 06:52 PM IST

కంభంలో పరిశుభ్రత పనుల పరిశీలన

ప్రకాశం: మార్కాపురం డీఎల్డీవో బాలునాయక్ కంభం పట్టణంలోని తర్లుపాడు రోడ్డుపై జరుగుతున్న చెత్త తొలగింపు పనులను శుక్రవారం పరిశీలించారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి, పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొన్నారు.

February 20, 2026 / 06:50 PM IST

చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో పల్లకి సేవ

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

February 20, 2026 / 06:48 PM IST

పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: DRO

KRNL: పదో తరగతి పరీక్షలను ఇబ్బందులు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల DRO డి.రామునాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 20, 2026 / 06:42 PM IST

పీలేరు ఆసుపత్రిని తనిఖీ చేసిన అధికారి

అన్నమయ్య: పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిని అన్నమయ్య జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎల్. రాధిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. టీబీ యూనిట్ రికార్డులు, నివేదికలను పరిశీలించి చికిత్స విధానాలపై అధికారులతో సమీక్షించారు. క్షయను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని సూచించారు. వైద్య సిబ్బందికి వ్యాధి నిర్మూలనలో మరింత చురుకుదనం అవసరమని పేర్కొన్నారు.

February 20, 2026 / 06:40 PM IST

పాముకాటుతో మహిళ మృతి

ATP: గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో పాముకాటుకు గురై చికిత్స పొందుతూ జయమ్మ అనే మహిళ శుక్రవారం మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గత రెండు వారాల క్రితం పాముకాటుకు గురైన జయమ్మను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 06:40 PM IST

అన్నా నేహా థామస్‌కు నటరాజ పురస్కారం

VZM: సీతం కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సాంస్కృతిక వైభవం కన్నుల పండుగగా సాగింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలలో నృత్య ప్రదర్శనలు గావిస్తూ విజయనగరం ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న అన్నా నేహా అన్నాథామస్‌కు నటరాజ పురస్కారాన్ని ప్రదానం చేసారు. అనంతరం ఆమె నృత్య ప్రదర్శనకు ప్రేక్షకులందరూ పరవశుతులయ్యారు.

February 20, 2026 / 06:38 PM IST

తెలుగు భాషకు సేవ చేస్తున్న కవులకు సత్కారం

ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భీమవరం JLB స్కూల్లో విద్యార్థినిలు భువన విజయం రూపకం శుక్రవారం ప్రదర్శించారు. మాతృభాష అభ్యున్నతికి పాటుపడుతున్న కలిగొట్ల గోపాలశర్మ, సాగిరాజు సత్యనారాయణరాజు, వేము వెంకటకృష్ణమోహన్, తెలుగు అధ్యాపకులు రోహిణి, మౌనిక భవానిలను సత్కరించినట్టు HM కృష్ణకుమారి, అల్లు శ్రీనివాసులు తెలిపారు. ఇందులో రిటైర్డ్ MEO.సీతారామరాజు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:35 PM IST

ఫ్రైడే డ్రైడేలో సూచనలు చేసిన డీఎంహెచ్వో

PPM: వ్యాదుల మూల కారణాలపై దృష్టి సారించి నియంత్రణ చర్యలు చేపట్టాలని DMHO డా ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. ఉల్లిభద్ర గ్రామంలో శుక్రవారం ఆయన సందర్శించి అక్కడ ఫ్రైడే డ్రైడే నిర్వహణ తీరు పరిశీలించారు. గ్రామంలో గృహ సందర్శనలు చేస్తూ పరిసరాల్లో నీటి తొట్టెలు, కాల్వలు పరిశీలించారు. లార్వా ఉనికి ప్రదేశాలను నియంత్రణ చెయ్యాలి అన్నారు.

February 20, 2026 / 06:35 PM IST

ఈ నెల 21వ తేదీ నుంచి అదనపు కేంద్రాలు ప్రారంభం

ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో అదనంగా 15 శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి కొత్త కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 6 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల ప్రకారం శనగ క్వింటాల్‌కు రూ. 5,875 చెల్లించబడుతుందని తెలిపారు.

February 20, 2026 / 06:35 PM IST

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

BPT: పిడుగురాళ్ల–వాడరేవు జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్చూరు వైపు వస్తున్న కారు, బైక్ బలంగా ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పర్చూరు SI పులి గోపి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 06:34 PM IST

బీసీ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం: పెద్దారవీడు గ్రామ పంచాయతీలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను ఎంపీడీవో జాన్ సుందరరావు ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లో వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

February 20, 2026 / 06:34 PM IST

ఉండిలో పర్యటించిన జేసీ

W.G: ఉండి మండలం చిన్నపులేరు గ్రామంలో జేసీ టీ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. పట్టాదారు పాస్ పుస్తకాల అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాల వెరిఫికేషన్ వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇందులో ఆర్డీఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి కె. జాషువా, MRO నాగార్జున పాల్గొన్నారు.

February 20, 2026 / 06:33 PM IST

నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం

CTR: తిరుపతి నుంచి రంగంపేట, భీమవరం, కొత్తపేట, పులిచెర్ల మీదుగా కల్లూరుకు నూతనంగా ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు RTC అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు తిరుపతి నుంచి బస్సు బయలుదేరి మధ్యాహ్నం 12:45కు కల్లూరుకు చేరుకుంటుందన్నారు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి ఇదే మార్గంలో తిరుపతికి వెళుతుందన్నారు.

February 20, 2026 / 06:31 PM IST

5 రోజుల్లోనే రైతులకు డబ్బులు జమ: జేసీ

నెల్లూరు జిల్లాలో శెనగ పంటను క్వింటాలకు రూ. 5875 వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జేసీ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. రైతులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2వ తేదీ లోపు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. తేమ శాతం 14% లోపు ఉన్న పంటను మాత్రమే సేకరిస్తామన్నారు. విక్రయించిన ఐదు రోజుల్లోనే నగదు జమ అవుతుందన్నారు.

February 20, 2026 / 06:30 PM IST