• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పశు వైద్యశాలలు ఆధునికరించాలి: ఎమ్మెల్యే

NLR: వ్యవసాయం తర్వాత లక్షలాది రైతు కుటుంబాలకు స్థిరమైన రోజువారీ ఆదాయం అందించే పాడి రంగాన్ని బలోపేతం చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం శాసనసభ సమావేశాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, పాడి పరిశ్రమ రెండు కళ్ళుగా అభివర్ణించారు. పశు వైద్యశాలలు ఆధునికరించాలన్నారు.

February 24, 2026 / 01:26 PM IST

కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉంది: MLA

GNTR: కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం అసెంబ్లీలో ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసాదంలో కల్తీ జరగడం యాదృచ్ఛికం కాదని, ఇది పక్కా ప్రణాళికతో చేసిన పని అని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమలలో జరిగిన అక్రమాలు బ్రిటిష్ పాలనకంటే దారుణంగా ఉన్నాయన్నారు.

February 24, 2026 / 01:25 PM IST

గోతులదొడ్డి సర్పంచ్ టీడీపీ పార్టీకి రాజీనామా..!

KRNL: గోతులదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, సర్పంచ్ లక్కీ హనుమంతమ్మ భర్త టీడీపీ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు లక్కే గోవింద్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీనే నమ్ముకుని పార్టీ కోసం కష్టపడితే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు అయినా గుర్తించకపోవడం చాలా బాధాకరమని వాపోతూ రాజినామా చేసినట్లు సమాచారం.

February 24, 2026 / 01:25 PM IST

తప్పుడు రిజిస్ట్రేషన్ ఘటనలో ఆరుగురు అరెస్ట్

AKP: నాతవరం మండలం లింగంపేట గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని తమ సొంత భూమిగా చూపిస్తూ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటనలో కేసు నమోదు చేశామని సీఐ రేవతమ్మ తెలిపారు. కోటవురట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు రెవెన్యూ, పంచాయతీ అధికారుల విచారణలో వెల్లడైందన్నారు. ఆరుగురిని అరెస్టు చేశామన్నారు.

February 24, 2026 / 01:25 PM IST

కంచికచర్ల ప్రభుత్వ ఖాజీగా షేక్ అబ్దుల్ రషీద్

ఎన్టీఆర్: కంచికచర్ల మండల ప్రభుత్వ ఖాజీగా నియమితులైన షేక్ అబ్దుల్ రషీద్ మంగళవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీ నాయకులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన ఆయనకు ఆమె అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనారిటీ సోదర సోదరీమణుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేయాలన్నారు.

February 24, 2026 / 01:23 PM IST

‘న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి’

కృష్ణా: చల్లపల్లి కేడీసీసీ బ్యాంకు వద్ధ సహకార సంఘ ఉద్యోగుల సమ్మె మంగళవారం 9వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సహకార సంఘాల ఉద్యోగులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు చండ్ర రవి కుమార్, తోట కృష్ణారావు, కోసూరు రామాంజనేయులు, నియోజకవర్గ పరిధిలోని 37 సొసైటీల సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 01:23 PM IST

760 అక్రమ మద్యం సీసాలు ధ్వంసం

SKLM: 2022-2026 వరకు ఆమదాలవలస పోలీసులు పట్టుకున్న అక్రమ మద్యాన్ని మంగళవారం ఎక్సైజ్ శాఖ DSP పి.రామచంద్ర కుమార్, ఆమదాలవలస ఎస్సై బాలరాజు సమక్షంలో మొత్తం 760 మద్యం సీసాలను ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ.1లక్షగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 01:23 PM IST

రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఫెయిల్: మాజీ మంత్రి

E.G: రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పనిచేయట్లేదని, పూర్తిగా ఫెయిల్ అయిందని EX మంత్రి విడుదల రజిని విమర్శించారు. కల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిందని మండిపడ్డారు. రాజమండ్రిలో కల్తీ పాలు స్వీకరించి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలన్నారు.

February 24, 2026 / 01:22 PM IST

శరవేగంగా ప్రధాన రహదారి నిర్మాణం

కృష్ణా: ఘంటసాల మండలం పూషడం నుంచి మల్లాయి చిట్టూరు ప్రధాన రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి పథకం నిధులతో నూతన రోడ్డు నిర్మాణం చేపట్టారు. జరుగుతున్న పనులను పంచాయతీరాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్, సర్పంచ్ ఆవుల రేవతి, టీసీ అధ్యక్షులు నరసయ్య పరిశీలించారు.

February 24, 2026 / 01:20 PM IST

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు

ప్రకాశం: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించాలనే లక్ష్యంతో పొన్నలూరులో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీస్ అధికారులు సిబ్బందిని నియమించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

February 24, 2026 / 01:20 PM IST

ఇంటర్ పరీక్షల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మంగళవారం అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయాల్లో కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

February 24, 2026 / 01:20 PM IST

తిరుపతి రూరల్ MPDOగా మస్తాన్ వలి

తిరుపతి రూరల్ నూతన ఎంపీడీవోగా మస్తాన్ వలి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. మస్తాన్ వలి మాట్లాడుతూ.. మండల అభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా పనిచేస్తానన్నారు.

February 24, 2026 / 01:20 PM IST

నిజరూపంలో మారెమ్మ దర్శనం..!

చిత్తూరు: పుంగనూరు పట్టణంలోని శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారి మూలవర్లను పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత పసుపు, కుంకుమ, కాటుకతో అమ్మవారిని నిజరూపంలో అలంకరించారు.

February 24, 2026 / 01:18 PM IST

రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు

ELR: గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో శ్రీ పార్వతి సమేత రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ధ్వజస్తంభం పునః ప్రతిష్ట సందర్భంగా మంగళవారం క్రొవ్విడి వంశీలు ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 24, 2026 / 01:17 PM IST

వైసీపీ పార్టీ కి కొత్త కో ఆర్డినేటర్..?

కోనసీమ: రాజోలు నియోజకవర్గం వైసీపీ పార్టీ కొత్త కో ఆర్డినేటర్‌ను నియమించనున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత కో ఆర్డినేటర్ గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు అనారోగ్యం కారణంగా తీసుకుంటున్న సందర్భంలో ఈ మార్పు అనివార్యమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటున్నారు.

February 24, 2026 / 01:16 PM IST