పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఫ్లిప్కార్ట్ , అమెజాన్ రెండూ పండుగల సమయంలో స్పెషల్ సేల్స్ నిర్వహిస్తాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహిస్తుండగా, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ను నిర్వహిస్తోంది.
జూలైలో ప్రాథమిక రంగ గృహాలతో సహా రియల్ ఎస్టేట్ రంగంలో బకాయిపడిన రుణాలు సంవత్సరానికి 37.4 శాతం పెరిగి రూ.24.28 లక్షల కోట్లు దాటినట్లు RBI సెక్టోరల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ డేటా తెలుపుతోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(sbi) తమ ఖాతాదారుల కోసం సరికొత్త సర్వీస్(doorstep banking services) ను అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఫ్రీగా డోర్స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ సేవలు కావాలంటే బ్యాంకింగ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని వెల్లడించారు.
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ నాయకత్వంలో మార్పు ప్రక్రియను కొనసాగిస్తోంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. ఆ తర్వాత బ్యాంక్ ఇప్పుడు కొత్త ఎండీ, సీఈవోని నియమించాల్సి ఉంటుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో, ఎండీ ఉదయ్ కోటక్ తన పదవీకి రాజీనామా చేశారు. ఆర్బీఐ నిబంధనల మేరకు ఓ వ్యక్తి 15 ఏళ్ల కన్నా ఎక్కువ రోజులు ఆ పదవీలో ఉండొద్దు. దాంతో ఆయన రాజీనామా చేశారు.
దేశీయ విమానాల పరంగా ఇది రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ అవుతుంది. ఇండిగో మొదటి స్థానంలో ఉంది. ఎయిరిండియాతో టాటా SIA ఎయిర్లైన్స్ విలీనానికి, సింగపూర్ ఎయిర్లైన్స్ (SIA) ద్వారా ఎయిర్ ఇండియాలో కొంత వాటాను కొనుగోలు చేయడానికి CCI ఆమోదించినట్లు నోటిఫికేషన్ పేర్కొంది.
. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా ఆర్థికమాంద్యం భయానికి వణికిపోతున్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్పులను జారీ చేస్తున్నాయి. గతేడాది ప్రారంభమైన గ్లోబల్ లేఆఫ్ల వేగం ఇప్పటికీ తగ్గడం లేదు. భారతదేశంలో కూడా అనేక రంగాలలోని కంపెనీలు నిరంతరంగా తొలగింపులను చేపడుతూనే ఉన్నాయి.
ఆదాయపు పన్ను శాఖ మహారాష్ట్ర, గుజరాత్ల పన్ను చెల్లింపుదారులకు సెక్షన్ 143(1) కింద ఇప్పటికే పన్ను నోటీసులు పంపింది. వారు సెక్షన్ 80P కింద మినహాయింపును వారు క్లెయిమ్ చేసారు. దీనిపై పన్ను చెల్లింపుదారులు 15 రోజుల్లోగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలియజేసింది.
రిజర్వ్ బ్యాంక్ పంచుకున్న డేటా ప్రకారం.. ఆగస్టు 31, 2023 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల కోట్లు అని బ్యాంకుల నుంచి అందిన సమాచారం. అంటే ఆగస్టు 31, 2023న రూ.0.24 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి.
మీరు వ్యవసాయాన్ని వ్యాపారంగా చేయాలనుకుంటే నిమ్మ గడ్డి సాగు మంచి ఎంపిక. నిమ్మ గడ్డి సాగు తక్కువ పెట్టుబడితో అనేక రెట్లు ఎక్కువ లాభాలను ఇస్తుంది. ఇది ఔషధ పంట. దీని నూనెతో అనేక సుగంధ ఉత్పత్తులను తయారు చేస్తారు.
మొన్న టమాలు.. తర్వాత ఉల్లిగడ్డలు.. ఇప్పుడు పెట్రోలియం(petrol), డీజిల్ ధరలు(diesel price) భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.305కు చేరింది. అయితే ఈ రేట్లు మన పక్క దేశమైన పాకిస్తాన్లో కొనసాగుతున్నాయి.
టమాటా ధర తగ్గుతుంది అనుకునే లోపే ఉల్లి ఘాటు ఎక్కువవుతోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.30-35 వరకు లభిస్తుండగా గత కొద్ది రోజులుగా ధర పెరుగుతోంది.
ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడిదారు జార్జ్ సోరోస్ OCCRP అదానీ గ్రూప్ పెట్టుబడిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. అదానీ కుటుంబానికి చెందిన భాగస్వాములు షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు 'ఆఫ్ షోర్' అంటే అపారదర్శక నిధులను ఉపయోగించారని సంస్థ పేర్కొంది.