Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. రెండు రోజులుగా భారీగా తగ్గుతూ కనిపించిన వెండి, బంగారం ధరలు మళ్లీ నేడు పెరిగిపోయాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర మంగళవారం రూ.73,845 ఉండగా బుధవారం రూ.534 పెరిగింది. దీంతో నేడు దీని ధర రూ.74,379కి చేరుకుంది.
చదవండి : గాలేస్తే వంతెన కూలిపోయింది సార్!
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.రూ.74,379గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
చదవండి : అక్కడ ఓటేస్తే హోటల్లో ఫ్రీ ఫుడ్
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) సైతం బుధవారం భారీగా పెరిగింది. ఈ ఒక్కరోజే రూ.1,153 పెరిగిపోయింది. దీంతో మంగళవారం రూ.82,485 ఉన్న దీని ధర బుధవారం నాటికి రూ.83,638కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి అరవెయ్యికి పైనే పెరగడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పాట్ గోల్డ్, వెండి ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం 2303 డాలర్లు ఉన్న స్పాట్ గోల్డ్ 24 డాలర్లు పెరిగి నేడు 2,327 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 27.45 డాలర్లుగా ఉంది.