ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL స్వదేశీ 4జీ సేవలు ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఒడిశాలోని జార్సుగుడా నుంచి ప్రధాని మోదీ చేతులమీదుగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇది క్లౌడ్ ఆధారిత నెట్వర్క్ అని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు 5జీకి సులువుగా అప్గ్రేడ్ అవ్వొచ్చని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.