AP: హిందువులకు మాజీ సీఎం జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. చెప్పులు వేసుకుని స్వామివారి ఫొటోలు పట్టుకున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో ఇదంతా జరిగిందని తెలిపారు. హిందూ ధర్మంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ నేతలకు లీగల్ నోటీసులు ఇస్తామన్నారు.