ప్రకాశం: త్రిపురాంతకం మండలం టి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన రైతు పుచ్చకాయల కేశయ్య (50) పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్షాక్తో మృతి చెందాడు. మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కేశయ్య ఇంటికి రాకపోవడంతో పొలంకు వెళ్ళిచూడగా మృతిచెంది కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై శివబసవరాజు కేసు నమోదు చేశారు.
TG: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్కు అల్లుఅర్జున్ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి(39) అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్, కుమార్తె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
KNL: బనగానపల్లె మండలంలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో దైవదర్శనానికి వచ్చి బోయ సురేంద్ర యువకుడు ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందాడు. సురేంద్ర పెద్ద కోనేరులో దిగుతున్న క్రమంలో కాలు జారీ కోనేరులో పడి మృత్యువాత పడ్డాడు. మృతుని స్వగ్రామం గుంతకల్లు మండలం పాత చెరువు గ్రామంగా స్థానికులు గుర్తించారు.
NLG: ఇంట్లోకి జొరబడి ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుండి పుస్తెలతాడును లాక్కెళ్ళిన ఘటన బుధవారం చిట్యాలలో చోటుచేసుకుంది. చిట్యాల ఎస్సై ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దొంగలు ఉరుమడ్ల రోడ్డులో గల చేపూరి ప్రేమలత ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కొట్టి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పూసలతాడును లాక్కెళ్లారు.
NLG: ఇంట్లోకి జొరబడి ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుండి పుస్తెలతాడును లాక్కెళ్ళిన ఘటన బుధవారం చిట్యాలలో చోటుచేసుకుంది. చిట్యాల ఎస్సై ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దొంగలు ఉరుమడ్ల రోడ్డులో గల చేపూరి ప్రేమలత ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కొట్టి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు.
AP: అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. రాయచోటిలో విద్యార్థులు టీచర్ను కొట్టి చంపారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు టీచర్ చాతిపై కొట్టడంతో ఉపాధ్యాయుడు ఏజాస్ క్లాస్రూమ్లోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. అల్లరి చేయొద్దని మందలించినందుకు దాడి చేసినట్లు తెలుస్తుంది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్ల...
AP: గుంటూరు కాజా టోల్ప్లాజా దగ్గర ఎర్రచందనంను పోలీసులు పట్టుకున్నారు. లారీలో చెన్నై నుంచి విశాఖకు తరలిస్తున్న రెండున్నర టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. లారీలో పేపర్ బండిల్స్ మధ్య ఎర్రచందనం దుంగలు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే డ్రైవర్, క్లీనర్ లారీ వదిలి పారిపోయారు.
న్యూయార్క్లో దారుణం జరిగింది. అమెరికా ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ యునైటెడ్ హెల్త్కేర్ సీఈవో బ్రియాన్ థాంప్సన్ హత్యకు గురయ్యారు. మిడ్టౌన్లోని హిల్టన్ హోటల్ బయట ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ముఖానికి మాస్కుతో వచ్చిన దుండగుడు బ్రియాన్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుడిని చంపేశారు. ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థులు తరగతి గదిలోనే ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. దీంతో ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఉపాధ్యాయుడిని ఆ విద్యార్థులు ఎందుకు చంపారనేది తెలియాల్సి ఉంది.
AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపల్లి హైస్కూల్లో ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందాడు. విద్యార్థులు అల్లరి చేస్తుండగా ఉపాధ్యాయుడు ఏజాస్ అహ్మద్ వారిపై కేకలు వేసాడు. ఆ సమయంలోనే ఆయన ఒక్కసారిగా తరగతి గదిలోనే కుప్పకూలాడు. వెంటనే రాయచోటి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
MDK: శివంపేట మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన తల్లి కూతుర్లు పూజ (23), నిషిత (2) అదృశ్యమైనట్టు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పడుకున్న పూజ, నిశిత తెల్లవారుజామున కనిపించలేదని వివరించారు. చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
కృష్ణా: విజయవాడ రాజీవ్ నగర్లో బుధవారం మధ్యాహ్నం మృతదేహం కలకలం రేపింది. నున్న పోలీసుల వివరాల మేరకు.. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 50 వరకు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి మృతుడి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
NDL: నందికొట్కూరు పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బుధవారం ఉర్దూ స్కూలు గేటు గోడ కూలీ మహిన్ అనే ఒకటవ తరగతి బాలిక మృతి చెందగా మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలు తగలగా చికిత్స నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం జరిగిన పాఠశాలను ఎమ్మెల్యే జై సూర్య పరిశీలించారు. మృతి చెందిన బాలికకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందిజేస్తామన్నారు.
PPM: పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బలగ శంకర్రావుకు చెందిన నాలుగు ఎకరాల వరిగడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.20,000 ఆస్తి నష్టం జరిగిందని శంకర్రావు తెలిపారు.
GNTR: పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పలపాడు చెరువులో గుర్తు తెలియని మృతదేహం బుధవారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని గుంటూరు నగరానికి చెందిన ఓ ట్రస్ట్ సభ్యుల సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఆ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు.