SKLM: పలాస మండలం నీలావతి గ్రామ సమీప తోటల్లో మాకన్నపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు కొన్ని రోజులుగా మందలు వేస్తున్నారు. గురువారం సాయంత్రం వంటకు అవసరమైన సరుకులు తెచ్చేందుకు గ్రామానికి వెళ్లగా గుర్తు తెలియని జంతువు దాడి చేసి సుమారు 25 గొర్రె పిల్లలను చంపివేసింది. గ్రామం నుంచి తిరిగి వచ్చిన గొర్రెల కాపరులు మద్దిల లచ్చయ్య కన్నీరు పెట్టుకున్నారు.
AP: కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 10 మంది రిమాండ్లో ఉండగా.. మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుడు కాళీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: గతనెల 27న రాంపల్లిలో జరిగిన శారద హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పత్తికొండ సీఐ పులిశేఖర్, తుగ్గలి ఎస్సై కృష్ణమూర్తితో కలిసి వివరాలు వెల్లడించారు. హత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టిగా, భార్యపై అనుమానంతో భర్త ఏకాశి రామానాయుడు, మద్దికెర లాలప్ప సహకారంతో కత్తితో పొడిచి హత్య చేశారని తెలిపారు.
కృష్ణా: నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో ఫ్రైడ్ రైస్ తినేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ తింటున్న ఓ వ్యక్తిపైకి వేగంగా వచ్చిన లారీ కాళ్లపై నుంచి వెళ్లడంతో, రెండు కాళ్లు విరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న నూజివీడు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని పరిశీలించారు.
విజయవాడకు చెందిన ఓ మహిళ ఆర్మీలో పనిచేసే వ్యక్తి చేతిలో మోసపోయారు. మురళీనగర్కు చెందిన మహిళ (45)కు పశ్చిమబెంగాల్లోని ఆర్మీలో పనిచేసే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈక్రమంలో అతని పిలుపు మేరకు ఆమె అక్టోబర్ 8న పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అప్పుడు అతనికి రూ. 8లక్షలు ఇచ్చి విజయవాడ వచ్చారు. ఆ తర్వాత డబ్బులు అడిగితే ఇవ్వకుండా తిట్టడం ప్రారంభించాడు.
PLD: నూజండ్లలోని హరిణి ఫర్టిలైజర్స్ షాపులో పురుగుమందుల విక్రయాలపై విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అనుమతులు లేకుండా ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. షాపులో పురుగుమందులు, ఎరువులు ఇన్వాయిస్లను, రిజిస్టర్లు, లైసెన్సులను పరిశీలించగా సరైన అనుమతి పత్రాలు లేవని నిర్థారణకు వచ్చారు. దీంతో రూ.6.83 లక్షల సరుకును సీజ్ చేశారు.
KDP: బి.కోడూరు మండలం మున్నెల్లి గ్రామ పంచాయతీ రాజుపాలెం గ్రామానికి చెందిన చర్మకారుల సంఘం అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు మున్నేల్లి కేశవ గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద మరణించడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనకు పలువురు టీడీపీ నాయకులు నివాళులర్పించారు.
AP: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చెల్లెలి చెలిమలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. యువకుడిని పట్టుకుని బాలిక బంధువులు దేహశుద్ది చేశారు. అంతేకాకుండా యువకుడి ఇంటికి గ్రామస్తులు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇరానీ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేయటానికి వెళ్లిన పోలీసులపై రాళ్లు రువ్విన ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ముంబై పోలీస్ అధికారి గాయపడ్డారు. ఇరానీ గ్యాంగ్ సభ్యులు చైన్ స్నాచింగ్లతో పాటు పలు నేరాలకు పాల్పడ్డారు. వారిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు అంబివ్లీ ప్రాంతానికి వెళ్లగా.. వారిపై పలువురు గ్యాంగ్ సభ్యులు రాళ్లు విసిరారు. రాళ్లదాడికి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీస...
SRPT: మఠంపల్లి మండలం భీమ్లా తండాకు చెందిన పానుగోతు పాచు అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అకారణంగా హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం మఠంపల్లి మండలంలోని సుల్తాన్పురం తండా సమీపంలో పానుగోతు పాచు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి రోడ్డు పక్కన పడేశారని తెలిపారు.
WGL: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనలు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘట గురువారం రాయపర్తి మండలం కేంద్రంలోచోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారిపై ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మైలారం చెందిన బిక్షపతి, ఐనవోలు మండలం గర్నెపెల్లి చెందిన రాజేష్ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
BPT: బాపట్ల మండలం అడవి పంచాయతీ హనుమత్ నగర్లోని ఓ వివాహితపై వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మద్దిబోయినవారిపాలెంకి చెందిన ఓ వ్యక్తి తనతో శారీరకంగా ఉండాలని వివాహితను బెదిరించాడు. అయితే వివాహిత దానికి అంగీకరించకపోవటంతో విచక్షణా రహితంగా కొట్టి గాయపరిచాడు. వివాహితకు బాపట్ల ఏరియా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.
MLG: తాడ్వాయి మండలం మేడారంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం రోజు ప్రేమ విఫలం కావడంతో పులిమాదిరి క్రాంతి (24) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా..? మరేదైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
SRD: బైక్ అదుపుతప్పి ఒకరికి తీవ్రగాయాలైన ఘటన గురువారం పెద్దపూర్లో చోటుచేసుకుంది. సదాశివపేట నుంచి సంగారెడ్డి వైపుకు ఒకరు బైక్పై వెళ్తూ పెద్దపూర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి పడిపోయారు. ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MHBD: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన కుదుళ్ల వీరన్న (48) శబరిమలలో గుండెపోటుతో మృతి చెందారు. అయ్యప్ప మాలధారణలో ఈ నెల 3న వీరన్న శబరిమల దర్శనానికి బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున వీరన్న గుండెపోటుకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆయన మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.