మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. మహారాష్ట్రలోని సిర్వంచ, అహేరి, గచ్చిరోలి, చంద్రపూర్లో భూప్రకంపనలు వచ్చాయి. అలాగే, ఛత్తీస్గఢ్లోని సుకుమా, బీజాపూర్లో స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.
ATP: జిల్లాలో విషాద ఘటన జరిగింది. రెండ్రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి కందుర్పిలో మిద్దె కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. మృతులు గంగన్న, సంధ్య, శ్రీదేవిగా గుర్తించారు. పాత మిద్దె కావడంతో వర్షానికి నాని కూలినట్లు తెలుస్తోంది.
ATP: గుత్తి పట్టణంలోని కమటం వీధిలో బుధవారం పాతబాకీ ఇవ్వాలని అడిగిన విషయంలో మాటమాట పెరిగి నాజీయ అనే వివాహితపై అదే కాలనీకి చెందిన వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో నజియాకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
AP: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుందుర్పిలో ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఇటీవల వర్షానికి మిద్దెపై వర్షపు నీరు నిల్వ ఉంది. దీంతో మిద్దె కూలినట్లు తెలుస్తోంది. మృతులను గంగన్న, శ్రీదేవి, సంధ్యగా గుర్తించారు.
AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. విజయవాడ, రాజమండ్రి, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరిలో సహా పలు ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే, తెలంగాణలో 20 ఏళ్ల తర్వాత 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమి లోపల 40 కి.మీ. నుంచి రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు వెల్లడించారు.
AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. విజయవాడ, రాజమండ్రి, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరి సహా పలు ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే, తెలంగాణలో 20 ఏళ్ల తర్వాత 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమి లోపల 40 కి.మీ. నుంచి రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు వెల్లడించారు. మీ ప్రాంతంలో కూడా భూకంపం వచ్చిందా? కామ...
TG: రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మంచిర్యాల జిల్లాల పరిధిలో భూప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్లోని వనస్థలిపురం, హయత్నగర్తో పాటు అబ్దుల్లాపూర్మెట్లో భూమి కంపించింది. మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో భూమి కంపించింది. కొత్తగూడెంలో ఉదయం 7:27 గంటలకు 3 సెకన్ల పాటు, ములుగులో అత్యధికంగా రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో ప్రకంపనల...
MBNR: చిన్నచింతకుంట మండలం, ఉంద్యాల, గ్రామానికి చెందిన మధు(18)గుండెపోటుతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గత రెండు రోజుల నుంచి చాతిలో నొప్పి వస్తుందని తెలిపాడు. అయితే ఈసీజీ నిమిత్తం ఆత్మకూరుకు తీసుకురాగా అంతలోనే మృత్యువాత పడినట్లు తెలిపారు. మధు గద్వాల పట్టణంలో ఐటీఐ చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. విజయవాడలో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భూమి కంపించింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు.
MBNR: బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి తహశీల్దార్ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రైల్వే బ్రిడ్జి నుంచి మండల కేంద్రానికి వస్తున్న ఆటో.. మండల కేంద్రం నుంచి రైల్వే బ్రిడ్జి వైపు వెళ్తున్న ఐస్ క్రీమ్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
అన్నమయ్య: రాజంపేట పట్టణ శివారుల్లోని భువనగిరిపల్లె అర్చి వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ – ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MNCL: ప్రేమ పేరుతో వంచించడంతో యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. హనుమాన్ బస్తీకి చెందిన సాయి స్నేహిత, శ్రీనాథ్లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. కాగా పెళ్లికి శ్రీనాథ్ నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ కారు నడుపుకుంటూ వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. గూగుల్ సందేశాలను అనుసరిస్తూ వెళ్లిన కారు కెనాల్లో పడిపోయింది. ఈ సంఘటన యూపీలోని రాయ్బరేలీ- పిలిభిత్ రహదారిపై జరిగింది. కాగా కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎలాంటి హాని జరగలేదు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఓ క్రేన్ను తీసుకువచ్చి కాలువలో పడిపోయిన కారును బయటకి తీశారు.
KNR: మొగ్దుంపూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై ఇద్దరు వ్యక్తులు కరీంనగర్ వైపు వెళ్తుండగా.. ఓ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో వారు లారీని వెనుకనుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చెన్నూర్కు చెందిన సాగర్ మృతిచెందారు. దండేపల్లి మండలం కన్నేపల్లికి చెందిన శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108కి సమాచారమిచ్చి ఆసుపత్రికి తరలించారు.
TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో ప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ఓ వాహనం చిరుతను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుతకు స్వల్ప గాయాలు కావడంతో చాలా సేపు రోడ్డుపైనే ఉంది. దీంతో చిరుతను చూసిన వాహనదారులు భయాందోళనకు గురైయ్యారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపైనే పడుకున్న చిరుత.. అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు గాలింపు చేపట్టారు.