NLG: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి డిమాండ్ చేశారు. నల్గొండ, పద్మనగర్లో మహిళలు కట్టెల పొయ్యి వెలిగించి నిరసన తెలిపారు. నిత్యవసరాల ధరలతో సతమతమవుతున్న పేదలపై గ్యాస్ భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ మేరకు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.