SKLM: నరసన్నపేట మండలం లుకలాంలో చింత చెట్టుపై నుంచి జారి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి చెందాడు. బొత్స శ్రీరాములు (52) మంగళవారం చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా కింద పడ్డాడు. స్థానికులు గమనించి నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.