NLR: పడుగుపాడు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎన్టీఎస్ గేట్ వద్ద మంగళవారం రైలు ఢీకొని బి. శివనారాయణ్ (60) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పడుగుపాడుకు చెందినవాడిగా గుర్తించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.