ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. మైదాన్గడిలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆ ఇంటికి వెళ్లి చూడగా రక్తపుమడుగులో 3 మృతదేహాలు కనిపించాయి. మృతులు ప్రేమ్ సింగ్, రజని, వారి కుమారుడు హృతిక్గా గుర్తించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రేమ్ సింగ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.