మేడ్చల్ పీఎస్ పరిధిలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రేకుల బావి వద్ద ఓ కారు వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఫ్లైఓవర్ పిల్లర్ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కాగా స్థానికులు వెంటనే గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.