అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లిలో వేటకొడవళ్లతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘర్షణకు వివాహేతర సంబంధాలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.