• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమర్‌కు మూర్తి యాదవ్ సవాల్

VSP: వైసీపీ హయాంలో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ మాజీ మంత్రి అమర్‌కు సవాల్ విసిరారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాల్లో వైసీపీ విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందని తెలిపారు.

April 29, 2026 / 07:34 PM IST

గోదావరిలో మట్టి తవ్వకాలను అడ్డుకున్న నర్సరీ రైతులు

E.G: కడియం మండలం కడియపులంక సమీపంలో గోదావరి నదిలో మట్టి తవ్వకాలను బుధవారం నర్సరీ రైతులు అడ్డుకున్నారు. మిషన్లు, లారీలు సిద్ధంగా ఉండగా రైతులు అన్నందేవుల దినేష్, ఆరేటి వెంకటరావు, గాధా గోవిందరాజు తదితరులు స్థలానికి చేరుకుని తవ్వకాలు నిలిపివేయించారు. కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు గోదావరిలో మట్టి తవ్వకాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

April 29, 2026 / 07:30 PM IST

బీసీ కార్పొరేషన్ ఈడీగా సుబ్రమణ్యం బాధ్యతలు స్వీకరణ

ATP: అనంతపురం బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా డి. సుబ్రమణ్యం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని ఈడీ కార్యాలయంలో ప్రస్తుత ఈడీ రామసుబ్బారెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది కొత్త ఈడీకి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

April 29, 2026 / 07:30 PM IST

జిల్లాలో విస్తృతంగా వాహనాల తనిఖీలు

సత్యసాయి: ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో హెల్మెట్ లేని ప్రయాణం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై నిఘా ఉంచారు. రాత్రి పహారా పెంచి గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నివారణే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

April 29, 2026 / 07:30 PM IST

వీఆర్వో మృతికి నివాళులర్పించిన అధికారులు

W.G: వీఆర్వో చిన్న మరణం రెవెన్యూ శాఖకు తీరని లోటని నరసాపురం తహశీల్దార్ ఐవివి సత్యనారాయణ అన్నారు. ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో అనారోగ్యంతో అకాల మరణం చెందిన కటకంశెట్టి సూర్యనారాయణ (చిన్నా)కి రెవెన్యూ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. సత్యనారాయణ అధ్యక్షతనలో సంతాప సభ నిర్వహించారు.

April 29, 2026 / 07:23 PM IST

అలెర్ట్.. రేపే లాస్ట్ డేట్..!

NDL: బేతంచర్ల నగర పంచాయతీ పరిధిలో పెండింగ్లో ఉన్న ఆస్తి పన్నులపై 50% వడ్డీ మాఫీ రాయితీ గడువు రేపటితో ముగుస్తుందని కమిషనర్ హరి ప్రసాద్ తెలిపారు. ఈనెల 9 నుంచి పొడిగించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2025-26 సంవత్సరానికి ముందస్తుగా పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. పన్ను బకాయిలు ఉన్నవారు త్వరగా చెల్లించాలని సూచించారు.

April 29, 2026 / 07:22 PM IST

హత్య కేసులోని నింధితుడు అరెస్ట్

ఏలూరు టూ టౌన్ పరిధిలో జరిగిన బంటు అంజలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లి పేరుతో మోసం చేసి, అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే నిందితుడు ఆమెను హత్య చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా రాజమండ్రిలో ఇవాళ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనుమానస్పద మృతినీ విచారణ అనంతరం హత్య కేసుగా మార్చామన్నారు

April 29, 2026 / 07:21 PM IST

‘పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలి’

BPT: బల్లికురవ మండలం కొణిదెన గ్రామంలో అద్దంకి వైసీపీ ఇంఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పార్టీ నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతంపై సుధీర్ఘంగా చర్చించారు. స్థానిక సమస్యలు, ప్రజల అభ్యర్థనలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

April 29, 2026 / 07:19 PM IST

తాగి వాహనం నడిపిన వ్యక్తికి జరిమానా

VZM: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రూ.10,000 జరిమానా ఇవాళ విధించింది. రోజువారీ తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని నెల్లిమర్ల ఎస్సై గణేష్ ఈ సందర్బంగా తెలిపారు. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా తప్పదని హెచ్చరించారు.

April 29, 2026 / 07:17 PM IST

జనవాణి ద్వారా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

తిరుపతి జనసేన కార్యాలయంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు అర్జీ రూపంలో స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురువారం కూడా ప్రజల నుంచి జనవాణి ద్వారా వినతులు స్వీకరిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

April 29, 2026 / 07:13 PM IST

‘శాఖల పనితీరు 100శాతం మెరుగుపడాలి’

ASR: ప్రభుత్వ శాఖలు 100శాతం లక్ష్యాలు సాధించేందుకు, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు కార్యక్రమాలన్ని ఈఆఫీసులోనే నిర్వహించాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో ఈ-ఆఫీస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికార యంత్రాంగం, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు శిక్షణ ఏర్పాటు చేశామన్నారు, 

April 29, 2026 / 07:11 PM IST

జిల్లాలో NTR భరోసా పింఛన్లకు నిధులు విడుదల

ATP: జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని 2,75,973 మంది లబ్ధిదారుల కోసం రూ. 124.01 కోట్ల నిధులను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. మే 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్ మొత్తం అందజేయనున్నారు.

April 29, 2026 / 07:06 PM IST

‘ఎండాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

NLR: ఎండాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాసరావు సూచించారు. బుచ్చి పట్టణంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి, మాట్లాడారు. పరిసరాల ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు మొలవడం వల్ల మల విసర్జనకు వెళ్లిన వారు సిగరెట్టు తాగి నిప్పురవ్వలు అక్కడ వేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

April 29, 2026 / 07:05 PM IST

వ్యక్తిగత విమర్శలు చేయడం తగదు: హమమప్ప

సత్యసాయి: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప డిమాండ్ చేశారు. బుధవారం పరిగి టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి సవితపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. సవిత నాయకత్వంలో పెనుకొండ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, దాన్ని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు.

April 29, 2026 / 07:04 PM IST

‘మే 2లోగా దరఖాస్తు చేసుకోండి’

E.G: అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్త, ఆయా పోస్టుల భర్తీకి మే 2వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూపర్వైజర్ అచ్చాయమ్మ తెలిపారు. కోరుకొండ ఐసీడీఎస్ పరిధిలోని ఇనుగంటివారిపేట, సీతానగరం, అశోక నగర్ కేంద్రాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. 21 నుంచి 35 ఏళ్ల వయసున్న స్థానిక మహిళలు ఈ పోస్టులకు అర్హులని, ఆసక్తి గలవారు వెంటనే కోరుకొండ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

April 29, 2026 / 07:02 PM IST