తిరుపతి జనసేన కార్యాలయంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు అర్జీ రూపంలో స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురువారం కూడా ప్రజల నుంచి జనవాణి ద్వారా వినతులు స్వీకరిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.