• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వరకట్నంపై అవగాహన కార్యక్రమం

VSP: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “వరకట్న నిషేధ చట్టం-1961”పై అవగాహన కార్యక్రమం పెందుర్తిలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఏ సన్యాసినాయుడు వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరమని తెలిపారు. నేరస్తులకు జైలు శిక్షలు, జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని, 1098 వంటి హెల్ప్‌లైన్‌లను వినియోగించుకోవాలని సూచించారు.

April 29, 2026 / 06:41 PM IST

విలేఖరి హత్యకు నిరసన.. ఎస్పీకి వినతి

NDL: విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసిస్తూ జిల్లా APUWJ నేతలు ఎస్పీ సునీల్ శేరాన్‌కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యదర్శి సభ్యులు శ్యాంసుందర్, జిల్లా అధ్యక్షుడు మధుబాబు నేతృత్వంలో ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విలేకరుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

April 29, 2026 / 06:39 PM IST

ప్రజలతో కలెక్టర్ చర్చ

TPT: తొట్టంబేడు(M) చోడవరంలో నిర్వహించిన రీసర్వే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు. భూ సర్వే ప్రక్రియను పర్యవేక్షించి, సమస్యలపై గ్రామస్థులతో నేరుగా మాట్లాడారు. భూ రికార్డుల పారదర్శకత కోసమే ఈ ప్రక్రియ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆర్. గోవిందరావుతో పాటు రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

April 29, 2026 / 06:37 PM IST

విషాదం.. ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య

BPT: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వేటపాలెం మండలం రావూరిపేటకు చెందిన దంపతులు మాజేటి ప్రభాకర్(33)-పార్వతి(24) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

April 29, 2026 / 06:31 PM IST

బ్రహ్మరథోత్సవంలో పాల్గొన్న మంత్రి

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో వైభవంగా జరిగిన శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మరథోత్సవంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చి రథాన్ని లాగుతుండగా మంత్రి వారితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.

April 29, 2026 / 06:30 PM IST

గాలివీడులో జలధార పనులు జోరుగా

అన్నమయ్య: గాలివీడు మండలంలో ‘జలధార-జలహారతి’ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కాలువలు, చెరువుల పునరుద్ధరణ పనులతో వర్షపు నీటి సంరక్షణకు తోడు సాగునీటి లభ్యత పెరుగుతోంది. రూ.5 లక్షల వ్యయంతో చేపట్టిన ఫీడర్ కాలువ పనుల ద్వారా సుమారు 210 ఎకరాలకు నీరు అందనుంది. ఈ కార్యక్రమం గ్రామీణ ఉపాధిని పెంచుతూ రైతులకు ఆశాజ్యోతి‌గా నిలుస్తోంది.

April 29, 2026 / 06:28 PM IST

‘ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి’

AKP: జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన ఎండలు వడగాల్పులు నేపథ్యంలో పారిశ్రామిక ప్రమాదాలను అరికట్టేందుకు, కార్మికుల భద్రతను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో పరిశ్రమల భద్రత ప్రమాణాలపై పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో భద్రత తనిఖీలు నిర్వహించాలన్నారు.

April 29, 2026 / 06:27 PM IST

అవినీతిపై చర్చకు సిద్ధమా?

PLD: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి కాన్వాయ్‌పై దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కారంపూడిలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకే పిన్నెల్లి సోదరులు ఈ కుట్ర పన్నారని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్వలేకనే ఇలా చేస్తున్నారన్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

April 29, 2026 / 06:26 PM IST

మంత్రి లోకేష్‌తో ఎమ్మెల్యే మర్యాదపూర్వక భేటీ

E.G: మంగళగిరిలో నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేష్ యువ నాయకత్వానికి ప్రతీకగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని, జాతీయ స్థాయిలో పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.

April 29, 2026 / 06:20 PM IST

మొక్కలు నాటిన జనసేన పట్టణ అధ్యక్షుడు

కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో జనసేన పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు బుధవారం మొక్కలను నాటారు. ఆసుపత్రి పరిసరాలను పచ్చదనంతో నింపేందుకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. పచ్చని వాతావరణం ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు.

April 29, 2026 / 06:19 PM IST

పన్ను చెల్లించేందుకు క్యూ కట్టిన ప్రజలు

CTR: ఆస్తి పన్నుపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిబేట్ రేపటి(గురువారం)తో ముగియనుంది. దీంతో బుధవారం సాయంత్రం పుంగనూరు పట్టణంలోని గృహాల యజమానులు పన్నులు చెల్లించేందుకు పురపాలక కార్యాలయానికి క్యూ కట్టారు. ప్రజల సౌకర్యార్థం కమిషనర్ మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు ప్రత్యేకంగా రెండు కౌంటర్లను ఏర్పాటు చేశారు.

April 29, 2026 / 06:18 PM IST

పెద్దారవీడులో ఘరానా చోరీ

ప్రకాశం: పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చూపించుకునేందుకు గుంటూరుకు వెళ్లారు. ఈ క్రమంలో దొంగలు ఆయన ఇంటిలో బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును దోచుకు వెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 29, 2026 / 06:15 PM IST

అభయ హస్తం గోడ పత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

ASR: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో, ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రభుత్వం సరికొత్త అత్యవసర చికిత్స పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ నిషాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం పీఎం రహత్ పథకం-రోడ్డు ప్రమాద బాధితులకు అభయ హస్తం గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 112కు కాల్ చేయవచ్చన్నారు

April 29, 2026 / 06:11 PM IST

చాకలి ఐలమ్మ సేవలు స్ఫూర్తిదాయకం: మంత్రి

సత్యసాయి: ధర్మవరంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి సత్యకుమార్ బుధవారం ఆవిష్కరించారు. సామాజిక న్యాయం, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన గొప్ప మహిళా నాయకురాలు చాకలి ఐలమ్మ అని మంత్రి కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. మహనీయుల సేవలను స్మరించుకోవడం ద్వారా సమాజంలో సమానత్వం, సామాజిక చైతన్యం పెంపొందుతుందన్నారు.

April 29, 2026 / 06:00 PM IST

ధాన్యం కళ్లాలను పరిశీలించిన జేసీ

KKD: పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో బుధవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ రైతు కళ్లాలను సందర్శించారు. వరి కోత యంత్రాల పనితీరు, కోత అనంతరం ధాన్యం తేమ శాతం వ్యత్యాసాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. జిల్లాలో రబీ కోత పనులు జోరుగా సాగుతున్నాయని, ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని జేసీ తెలిపారు.

April 29, 2026 / 06:00 PM IST