• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఒంటిమిట్ట సీఐ బదిలీ

KDP: ఒంటిమిట్ట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐగా పనిచేస్తున్న పి.నరసింహరాజును కడప నగరం తాలుకా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ గతేడాది నవంబరు 12న బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా అయిదు నెలలకే స్థాన చలనం కల్పించారు. కడప నేర విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీహరి ఒంటిమిట్టకు రానున్నారు.

April 12, 2026 / 07:12 AM IST

‘అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీ’

ATP: అమరావతి రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడులో పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా ఎమ్మెల్యే పరిటాల సునీత అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

April 12, 2026 / 07:10 AM IST

సామర్లకోటలో చోటా గ్యాస్ సిలిండర్లు రెడీ

KKD: ప్రభుత్వాల ఆదేశాల మేరకు సామర్లకోటలో పేద ప్రజలు, వలస కూలీలకు చోటా సిలిండర్లను అందిస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు శనివారం తెలిపారు. గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా కార్మికులు పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ప్రధాన గ్యాస్ కంపెనీలు ఐదు కేజీల సిలిండర్లు సరఫరా చేపట్టాయి. ఏదేని ఒక గుర్తింపు ఉంటే ఐదు కేజీల సిలిండర్‌ను అందిస్తామన్నారు.

April 12, 2026 / 07:10 AM IST

త్వరలో నంది అవార్డులు, నాటకోత్సవాలు నిర్వహిస్తాం: మంత్రి

W.G: రాష్ట్రంలో త్వరలో నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. పాలకొల్లులోని అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతిలో భాగమైన రంగస్థల కళలను ప్రోత్సహించేందుకు నాటకోత్సవాలను నిర్వహిస్తామన్నారు.

April 12, 2026 / 07:09 AM IST

జిల్లాలో పెరిగిన మాంసం ధరలు..!

ఎన్టీఆర్: విజయవాడలో ఆదివారం మాంసం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. చికెన్ స్కిన్‌లెస్ కేజీ రూ.220 పలుకుతుండగా, మటన్ కేజీ రూ.900కు చేరింది. చేపలు రకాన్ని బట్టి కిలో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. 30 కోడి గుడ్ల ధర రూ.135గా ఉంది. సెలవు రోజు కావడంతో మార్కెట్ల వద్ద రద్దీ కనిపిస్తున్నప్పటికీ, పెరిగిన ధరలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

April 12, 2026 / 06:54 AM IST

జిల్లా సెషన్స్ జడ్జిగా నిర్మల

VZM: రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్‌లుగా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్ జడ్జిలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు చీపురుపల్లికి చెందిన బంకపల్లి నిర్మలకు విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా పదోన్నతి లభించింది. దీనిపై గ్రామస్థులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జడ్జిగా పని చేస్తున్నారు. 

April 12, 2026 / 06:45 AM IST

సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి సవిత

SS: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తన శాఖల ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై సీఎంతో చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన ‘జలధార’, ‘స్వచ్ఛాంధ్ర’ వంటి కార్యక్రమాల్లో మంత్రులంతా భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారు.

April 12, 2026 / 06:40 AM IST

మాజీ ఆర్థిక మంత్రి త్వరగా కోలుకోవాలి: సీఎం

KKD: మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సూచన మేరకు యనమలకు స్టంట్ వేయించగా, ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఫోన్ ద్వారా యనమల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

April 12, 2026 / 06:36 AM IST

మైనర్ల తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సెలింగ్

ATP: అనంతపురం నగరంలో మైనర్ డ్రైవింగ్ అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మైనర్ల తల్లిదండ్రులకు పరేడ్ మైదానంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత పది రోజుల్లో 215 మంది మైనర్లను గుర్తించి ఈ అవగాహన కల్పించారు. చిన్న వయసులో వాహనాలు ఇవ్వడం వల్ల ప్రాణాపాయం ఉంటుందని డీఎస్పీ హెచ్చరించారు.

April 12, 2026 / 06:35 AM IST

17న ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ డే: కలెక్టర్

PPM: ఈ నెల 17న ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకర రెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు కలక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని సూచించారు. ప్రతి నెల మూడవ శుక్రవారం ఈ గ్రీవెన్స్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

April 12, 2026 / 06:29 AM IST

ప్రజలు శాంతిభద్రతలను కాపాడాలి : SI

KDP: రాజుపాలెం(M) పర్లపాడులో మహేశ్ హత్యకు గురైన నేపథ్యంలో గ్రామంలో ప్రతీకార దాడులు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం SI ప్రణయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి, ప్రజలు మతసామరస్యాన్ని, శాంతిభద్రతలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఉద్రిక్తతలు సృష్టించినా, తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 12, 2026 / 06:21 AM IST

వెలిగండ్లలో తాగునీటి సమస్యతో ప్రజల ఇబ్బందులు

ప్రకాశం: వెలిగండ్ల గ్రామపంచాయతీలో వారం రోజులుగా తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా చూడాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండు రోజులకొకసారి అయినా నీటిని విడుదల చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

April 12, 2026 / 06:17 AM IST

న్యాయవాదిగా ప్రాక్టీస్.. నేడు డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి

W.G: విజయవాడలో 3వ అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్న వెంకటేశ్వరరావు జిల్లా, సెషన్స్ జడ్జిగా పదోన్నతి పొందారు. పాలకొల్లు బార్ అసోసియేషన్ సభ్యులు ఆయనను అభినందించారు. కొంతేరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు గతంలో పాలకొల్లు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి, జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. సీనియర్ సివిల్ జడ్జిగా ఎదిగి, ఇప్పుడు జిల్లా జడ్జి అయ్యారు.

April 12, 2026 / 06:16 AM IST

కదిరిలో రాష్ట్ర స్థాయి షాట్ బాల్ పోటీలు ప్రారంభం

SS: కదిరిలోని బ్లూమూన్ విద్యాసంస్థల ప్రాంగణంలో నాలుగో రాష్ట్ర స్థాయి గోల్ షాట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరై జ్యోతిని వెలిగించి ఈ క్రీడలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, క్రమశిక్షణకు తోడ్పడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

April 12, 2026 / 06:15 AM IST

విద్యార్థిని మృతి : ఐదుగురిపై సస్పెన్షన్ వేటు!

AKP: అచ్యుతాపురం KGBVలో ఏడవ తరగతి విద్యార్థిని మైలపల్లి నవ్య మృతి చెందిన ఘటనపై ప్రిన్సిపల్ ఉమా దేవితో పాటు నలుగురిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. బాలిక మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు కేజీబీవీ గేటు వద్ద ఆందోళన చేశారు. సస్పెండ్ అయినవారిలో ఎన్.ఎస్. టీచర్ సునీత, ఒకేషనల్ టీచర్ రూప, వాచ్ ఉమెన్ చిలకమ్మ, ఏఎన్ఎం ఈశ్వరి ఉన్నారు.

April 12, 2026 / 06:13 AM IST