ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయాల స్థితిగతులు, బకాయిల పరిష్కారం కోసం ఛైర్మన్ వన్నెం రెడ్డి సతీష్ కుమార్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను మంగళవారం కలిశారు. గ్రంథాలయాల అభివృద్ధికి అవసరమైన చర్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ భవనాల్లో ఉన్న గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు, డిజిటల్ సదుపాయాలు కల్పించాలని కోరారు.
NDL: బండి ఆత్మకూరు మండలంలోని ఏ.కోడూరు, పార్నపల్లె, బండి ఆత్మకూరు పశు వైద్యశాలలను వెలుగోడు సబ్ డివిజన్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్. వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. పశువైద్యశాలలో రిజిస్టర్లను, మందులను పరిశీలించారు. గాలికుంటు వ్యాధి టీకాల ప్రగతిని సమీక్షించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. వారితో పాటు మండల పశు వైద్యులు పాల్గొన్నారు.
VZM: పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ను తగ్గించే జీవో 60ను తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం అధ్యక్షులు మంత్రి రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అధిక పని ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఈ విధమైన జీవో తమకు తీవ్ర నిరాశను కలిగిస్తుందన్నారు.
AKP: ఎలమంచిలి పట్టణం అన్న క్యాంటీన్ను మంగళవారం నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా భోజన సౌకర్యంపై ఆరా తీశారు. ఎలమంచిలి నియోజకవర్గంలో మరో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐదు రూపాయలకే పేద ప్రజలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
KRNL: రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ అమరావతికి పూర్తి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఊపిరి అన్నారు.
కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రామానగరంలో అగ్ని ప్రమాదం జరిగింది. క్లబ్ రోడ్డులో పేరుబోయిన రాంబాబుకు చెందిన ఐదు ఎకరాల గడ్డివాము అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో రైతుకు రూ.75వేలు నష్టం జరిగింది.
NTR: నందిగామ మండలం చందాపురంలో రీ సర్వే ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రైతులకు కొత్త పట్టాదారు పాస్పుస్తకాలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో రీ సర్వేలో వచ్చిన తప్పులను సరిదిద్ది, రాజముద్రతో కూడిన నాణ్యమైన కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ భూమి సమస్యలు తీరినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
BPT: చీరాల సముద్రతీరంలో అక్రమంగా సాగుతున్న నిర్మాణాల వల్ల మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటోందని, బీచ్ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని డీసీసీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చీరాల తీరంలో లాడ్జీలు, బాపట్ల బీచ్ పరిసరాల్లో రిసార్టులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
WG: మొగల్తూరు మండలం శేరేపాలెంలో మంగళవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. MLA బొమ్మిడి నాయకర్, TDP ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువైద్యులు గ్రామంలోని పశువులకు వైద్య పరీక్షలు చేసి, చికిత్స అందించారు. అనంతరం అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు కోరారు.
NDL: రుద్రవరం ఆదర్శ పాఠశాలలో ఈనెల 12న 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మంగళవారం ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు ఈనెల 5 నుంచి ఏపీ వెబ్సైట్లో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.
ATP: కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పూర్వవైభవం తెస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురంలో జరిగిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ.. చేనేత భరోసా కింద రూ.25 వేలు అందిస్తామని ప్రకటించారు. మగ్గాలకు ఉచిత విద్యుత్ ఇస్తూ ప్రభుత్వం నేతన్నలకు భరోసా కల్పిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కార్మికులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.
కృష్ణా: చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో గుండేరు మేజర్ డ్రైనేజీపై నూతన వంతెన మంజూరు చేయాలని గ్రామస్థులు రాష్ట్ర మంత్రి బీ.సీ.జనార్దన రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గుండేరుపై వంతెన దాదాపు పదేళ్ల నుంచి శిథిలావస్థకు చేరి ఉందని తెలిపారు. ఇటీవల గుర్రపు డెక్క పట్టేసి వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుందని, నూతన వంతెనకు నిధులు కేటాయించాలని కోరారు.
NTR: ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధానలక్ష్యమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. కొండపల్లిలోని పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను తెలుసుకున్నారు. 60 మంది అర్జీలు సమర్పించారు. సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.
E.G: సీతానగరం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం భారతి ఆధ్వర్యంలో ‘నీటి భద్రత’పై సమీక్ష జరిగింది. ఏప్రిల్ 6 నుంచి 100 రోజుల పాటు చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంతో కాలువల పూడికతీత, కట్టల బలోపేతం చేయాలన్నారు. నీటిమట్టం 3-6 మీటర్లకు పెంచడమే లక్ష్యమని, సాగునీటి సంఘాలు భాగస్వాములు కావాలని కోరారు.
W.G: ధాన్యం తరలింపు సమయంలో రైతులు కల్లాలు, RSK వద్దే ట్రక్ షీట్ నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. మిల్లుల వద్ద నమోదు చేయవద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే రవాణా ఛార్జీలు రావని కేంద్రం హెచ్చరిస్తోందని తెలిపారు. దళారీలను ఆశ్రయించి మోసపోవద్దని రైతులకు హితవు పలికారు.