• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు: DIEO

కోనసీమ: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా డీఐఈవో చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ నెల 27తో ముగిసిన గడువును బోర్డు కమిషనర్ చివరిసారిగా పొడిగించారని, ఇకపై గడువు పెంచబోమని స్పష్టం చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు తమ కాలేజీల ద్వారా వెంటనే ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు.

April 28, 2026 / 04:10 PM IST

చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం

ELR: పోతిరెడ్డి పల్లి గ్రామంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, ఇతర నేరాలపై ఇవాళ ప్రజలకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అటువంటి పనులకు పాల్పడే తల్లిదండ్రులు, ఇతరులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

April 28, 2026 / 04:05 PM IST

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి

ప్రకాశం: మర్రిపూడి మండలం అయ్యవారిపాలెం గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి అయ్యవారిపాలెం గ్రామానికి చెందిన కొండప నాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. దెబ్బతిన్న రోడ్డు వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

April 28, 2026 / 04:03 PM IST

పెట్రోల్ బంక్ ఎదుట సీపీఐ నిరసన

NDL: డోన్ పట్టణంలోని పెట్రోల్ బంక్ ఎదుట ఇవాళ సీపీఐ జిల్లా కార్యదర్శి రంగం నాయుడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గత మూడు రోజుల నుంచి పెట్రోల్ బంకులలో ఇంధనం లేకపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధముగా చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.

April 28, 2026 / 04:02 PM IST

ఆదోనిలో నేలకొరిగిన భారీ వృక్షం

KRNL: ఆదోని పట్టణ ఆర్టీసీ కాలనీలో ఇవాళ ఓ భారీ వృక్షం నేలకొరిగింది. మున్సిపల్ పార్కు వద్ద కూకటివేళ్లతో కూలిన చెట్టు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆర్టీసీ కాలనీ, శ్రీనగర్, విట్టా కిష్టప్ప నగర్ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. వేసవి వేళ విద్యుత్ లేక చిన్నపిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికుల సమాచారం.

April 28, 2026 / 04:01 PM IST

కూలి డబ్బులు చెల్లించాలని ఆందోళన

E.G: దేవరపల్లి మండలం యాదవులలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంకేం రామకృష్ణ అనే పొగాకు రైతు వద్ద పని చేసిన కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కూలీలు తమకు కూలి డబ్బులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డు చాకిరి చేయించుకుని ఎకనామం పెట్టాడని ఆరోపిస్తూ రైతు ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.

April 28, 2026 / 04:00 PM IST

నిరసన బాట పట్టిన జర్నలిస్టులు

W.G: చిత్తూరు జిల్లా వి.కోటలో రిపోర్టర్ జగన్ మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ ఆచంటలో ఇవాళ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టులపై దాడులు పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 04:00 PM IST

‘ప్రజలను విముక్తులను చేయడానికే ప్రజాదర్బార్’

KDP: ప్రజలు పడుతున్న సమస్యల నుంచి విముక్తులను చేయడానికే ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు పులివెందుల TDP ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. CM చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు ఇవాళ పులివెందుల TDP కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

April 28, 2026 / 04:00 PM IST

నీటి సరఫరా అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ సమావేశం

నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పంచాయతీరాజ్, నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేశారు. ఆమె మాట్లాడుతూ… మంజూరు చేసిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అలా కాని పక్షంలో ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పనులు మంజూరు చేయుటకు తగు ప్రతిపాదనలు పంపాలన్నారు.

April 28, 2026 / 03:50 PM IST

ప్రత్తిపాడు అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు జడ్పీ హాల్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో సమావేశమై స్వర్ణాంధ్ర విజన్-2047పై చర్చించారు. మౌలిక వసతులు, రహదారులు, తాగునీటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడొద్దని, ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు.

April 28, 2026 / 03:49 PM IST

కోన ఫిల్లింగ్ స్టేషన్‌లో తనిఖీలు

బాపట్ల పట్టణంలోని కోన ఫిల్లింగ్ పెట్రోల్ బంకులో మంగళవారం అధికారులు తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్, సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. బంకులో ఉన్న ఇంధన నిల్వలు, నాణ్యత, పంపిణీ తీరును వారు నిశితంగా పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇంధన విక్రయాలు జరగాలని బంక్ నిర్వాహకులకు సూచించారు.

April 28, 2026 / 03:48 PM IST

‘నిరుపేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం’

SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశాకిరణంగా మారిందని అన్నారు.

April 28, 2026 / 03:45 PM IST

‘డిమాండ్‌కు తగినట్లుగా పెట్రోల్, డీజిల్ సరఫరా’

కోనసీమ: అదనపు ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరాకు చర్యలు చేపట్టామని కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిమాండ్‌కు తగినట్లుగా పెట్రోల్, డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మూతబడిన బంకులను దశలవారీగా తెరిపిస్తామన్నారు.

April 28, 2026 / 03:40 PM IST

‘వైసీపీ ఉనికి కోసమే ఆరోపణలు’

సత్యసాయి: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఉనికి కోసం మంత్రి సవితపై ఆరోపణలు చేస్తున్నారని సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, టీడీపీ పట్టణ కన్వీనర్ శ్రీరాముల విమర్శించారు. మంగళవారం పెనుకొండలో వారు మాట్లాడుతూ.. పెనుకొండలో అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పట్టించుకోలేదని, ఇప్పుడు విమర్శలు చేయడం తగదని అన్నారు.

April 28, 2026 / 03:40 PM IST

ఒక్క కిలో కూడా తారం తీయవద్దు: ఎమ్మెల్యే

NTR: రెడ్డిగూడెంలో మంగళవారం ప్రజాదర్బారులో పలువురు రైతులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుని కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ సతీష్‌తో ఫోన్లో మాట్లాడి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలన్నారు. రబీ ధాన్యాన్ని 3రోజుల వ్యవధిలోనే కొనుగోలు చేస్తామన్నారు. ఒక్క కిలో కూడా తారం తీయవద్దని ఆదేశించారు.

April 28, 2026 / 03:36 PM IST