• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రతి ఒక్కరూ ఫెర్రర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి: బల్లా పల్లవి

ATP: ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతిని అనంతపురంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. సమాజ సేవకు అంకితమైన ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

April 9, 2026 / 03:00 PM IST

అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని శవం లభ్యం

KDP: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని బస్వాపురం టోల్ ప్లాజా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో స్థానికులు ఓ గుర్తుతెలియని మగ శవాన్ని గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు ఐదు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు శవాన్ని కాల్చి పడవేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

April 9, 2026 / 02:50 PM IST

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పాణ్యం ఎమ్మెల్యే

KRNL: ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

April 9, 2026 / 02:44 PM IST

‘పదోన్నతుల ఆరోపణలు నిరాధారం’

విశాఖలో హెడ్ నర్సుల పదోన్నతులపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వ నర్సుల సంఘం ఖండించింది. గంగా భవానీ, జీవీఎస్ వరలక్ష్మి నేతృత్వంలో 39 మంది విచారణకు హాజరై పూర్తి వివరాలు సమర్పించారు. ఫిర్యాదుదారులు హాజరుకాకపోవడంతో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. పదోన్నతుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదని తెలిపారు.

April 9, 2026 / 02:39 PM IST

‘సర్పంచుల సేవలు అమూల్యం’

SKLM: గ్రామాల అభివృద్ధికి సర్పంచుల చేసిన సేవలు అమూల్యం అని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. కొత్తూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన సర్పంచులను ఘన సత్కారం చేసి మెమొంటోలు అందజేశారు. గ్రామ స్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

April 9, 2026 / 02:36 PM IST

మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు

TPT: నాయుడుపేట మండలం శ్రీరామ్ నగర్‌లో పట్టపగలు దుండగులు మహిళ మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును అపహరించి పరారయ్యారు. గిరిజమ్మ అనే మహిళ ఇంటి ముందు ఉన్న సమాయంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వాటర్ ప్యాకెట్లు, చాక్లెట్లు అడిగి మాయచేశారు. అనంతరం ఒక్కసారిగా మెడలో ఉన్న గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 9, 2026 / 02:36 PM IST

వేటపాలెంలో పోషణ పక్వాడ కార్యక్రమం

BPT: వేటపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న పోషణ పక్వాడ 8వ ఎడిషన్ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యాధికారిణి డాక్టర్ టీ. ప్రియాంక మాట్లాడుతూ.. శిశువు జననం నుంచి తొలి ఆరు సంవత్సరాల లోపు మెదడు అభివృద్ధిని గరిష్ట స్థాయికి పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.

April 9, 2026 / 02:35 PM IST

‘భూ హక్కులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం’

ATP: రాయదుర్గం మండలం డీ.కొండాపురం గ్రామంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పంపిణీ చేశారు. రైతుల భూ హక్కులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకాలు పారదర్శకతకు ప్రతీకగా నిలుస్తాయని, ప్రతి రైతుకు చట్టబద్ధమైన రక్షణ అందించేలా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

April 9, 2026 / 02:30 PM IST

‘దేవస్థానం కబ్జా భూమిని విడిపించాలి’

KRNL: మంత్రాలయం మండలం సూగురు గ్రామంలోని శ్రీ వీరలింగేశ్వర స్వామి, ఆసమండేశ్వర స్వామి దేవాలయ భూమిని కబ్జాదారుల నుంచి విడిపించాలని గురువారం హిందూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కబ్జా చేసిన వారిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవస్థాన కమిటీ సభ్యులు గురుమూర్తి, జనార్ధన్ PSలో వినతి పత్రం అందజేశారు.

April 9, 2026 / 02:29 PM IST

తణుకులో ‘చేంజ్ మేకర్స్’.. 350 కిలోల ప్లాస్టిక్ సేకరణ

W.G: తణుకులో ప్లాస్టిక్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్ అధికారులు గురువారం కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల నుంచి సుమారు 350 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

April 9, 2026 / 02:28 PM IST

వాణిజ్య సముదాయం ప్రారంభం

కృష్ణా: మచిలీపట్నంలో మహిళల ఆర్థిక సాధికారత కోసం జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో వాణిజ్య సముదాయం గురువారం ఏర్పాటు చేశారు. 15 శాతం స్త్రీ, శిశు సంక్షేమ నిధుల నుంచి రూ.2 కోట్లతో నిర్మించిన ఈ సముదాయాన్ని చైర్‌పర్సన్ ఉప్పల హారిక, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి సాధించి కుటుంబాలను బలోపేతం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని హారిక తెలిపారు.

April 9, 2026 / 02:27 PM IST

రుద్రవరం తహశీల్దార్‌గా నాగవీణ బాధ్యతల స్వీకరణ

NDL: రుద్రవరం మండల నూతన తహశీల్దార్ నాగవీణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ధోని ఆల్ ఫ్రైడ్ నంద్యాల కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నియమితులైన నాగవీణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజా సేవలో ముందుంటానన్నారు.

April 9, 2026 / 02:26 PM IST

సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: కలిదిండి మండలం సంతోషపురంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అలాగే సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు సత్వరమే అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

April 9, 2026 / 02:25 PM IST

న్యాయవాది దారుణ హత్య.. ఐదుగురు నిందితుల అరెస్ట్

అన్నమయ్య: కేవీ పల్లి మండలం పరిధిలో పాత కక్షలు, గ్రామ ఆధిపత్య పోరుతో న్యాయవాది పూజారి యల్లయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. నిందితులు ముందస్తు పథకం ప్రకారం ట్రాక్టర్లతో దారిని దిగ్బంధించి, ఇంటిపై దాడి చేసి బండరాళ్లతో హత్య చేసినట్లు వెల్లడించారు.

April 9, 2026 / 02:24 PM IST

బద్వేలులో ఉరి వేసుకొని మహిళ మృతి

KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త మున్సిపల్ ఆఫీస్ సమీపంలో అమిలిపోగు అమ్ములు అనే మహిళ ఉరి వేసుకొని గురువారం ఆత్మహత్య చేసుకుంది. మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత మహిళ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 9, 2026 / 02:23 PM IST