• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు మంజూరు చేయాలి’

PLD: జిల్లాలో ప్రతి అర్హుడైన రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు ఆర్థికంగా బలం చేకూర్చే లక్ష్యంతో కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు.

April 9, 2026 / 05:54 PM IST

రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఎంపీడీవోకు వినతి

ATP: నార్పల మండలం మడుగుపల్లి క్రాస్ నుంచి గూగూడు వరకు గల 4 కిలోమీటర్ల పంచాయతీ రోడ్డును బాగుచేయాలని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్య దర్శి కుళ్లాయప్ప కోరారు. ఈ మేరకు ఎంపీడీవో మమత దేవికి వినతి పత్రం ఇచ్చారు. గూగూడు కుల్లాయిస్వామి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తుంటారని, భక్తుల సౌకర్యార్థం నూతన రోడ్డు వేయాలని విన్నవించారు.

April 9, 2026 / 05:50 PM IST

రోడ్డు ప్రమాదాలు నివారించాలి

CTR: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సమిష్టి కృషితో పాటు.. అవగాహన కల్పించాలని కోరారు.

April 9, 2026 / 05:41 PM IST

రాయచోటిలో సెమినార్‌కు ప్రత్యేక ఆకర్షణ

అన్నమయ్య: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏసియన్ అండ్ పసిఫిక్ స్టడీస్ (సీప్) స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయచోటికి చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, మోటకట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజలు ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరిగిన అంతర్జాతీయ సెమినార్‌లో హాజరయ్యారు.

April 9, 2026 / 05:35 PM IST

రీ సర్వేను పరిశీలించిన ఆర్డీవో ఆనంద్ కుమార్

సత్యసాయి: గుడిబండ మండలంలలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్ పర్యటించారు. మండలంలోని చిగాతుర్పి గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను రైతుల సమక్షంలో పరిశీలించారు. అనంతరం సర్వేయర్లతో మాట్లాడుతూ.. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సర్వే చేయాలన్నారు. రైతులకు రీసర్వే గురించి వివరించారు.

April 9, 2026 / 05:30 PM IST

కార్యకర్తలతో మాజీ మంత్రి శైలజనాథ్ సమావేశం

ATP: శింగనమలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

April 9, 2026 / 05:30 PM IST

ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష సమావేశం

W.G: రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా, కోఆపరేటివ్ శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై గురువారం జిల్లా జేసీ రాహుల్ కుమార్ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్, మే నెలలు రబీ సీజన్‌కు కీలకమని ఈ కాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి కేంద్రంలో కనీసం 50 శాతం గోనె సంచులు సిద్ధం చేయాలని కోరారు.

April 9, 2026 / 05:28 PM IST

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రచార రథం

KRNL: వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో బాల్య వివాహాలు, కౌమార గర్భాల నివారణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇవాళ “బాల్య వివాహ విముక్తి ప్రచార రథం” కార్యక్రమం నిర్వహించారు. కళాజాత బృందాలు పాటలు, నాటికల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాయి. ICDS పద్మావతి, సరస్వతి పలువురు “బేటీ బచావో – బేటీ పడావో” సందేశంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

April 9, 2026 / 05:27 PM IST

జనాభా గణనకు సిద్ధం.. మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

GNTR: తెనాలి మండలంలో జనాభా గణనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మార్వో గోపాలకృష్ణ తెలిపారు. మే 1–30 వరకు హౌస్ లిస్టింగ్, ఏప్రిల్ 16–30 వరకు స్వచ్ఛంద నమోదు అవకాశం కల్పించారు. జనాభా గణనకు ప్రజలు భయపడకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

April 9, 2026 / 05:25 PM IST

ఏలూరులో డెడ్ బాడీ కలకలం

ELR: ఏలూరులో గిలకల గేటు రైల్వే ట్రాక్‌పై గురువారం ఉదయం ఓ డెడ్ బాడీ కలకలం రేపింది. డ్యూటీలో ఉన్న ట్రాక్ మ్యాన్ రెండు ముక్కలైన మృతదేహాన్ని చూసి రైల్వే జీఆర్పీ ఎస్సైకు సమాచారం ఇచ్చారు. ఎస్సై దానం ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించి ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందవచ్చునన్నారు. మృతుడికి 65 ఏళ్లు ఉండవచ్చునని పేర్కొన్నారు.

April 9, 2026 / 05:24 PM IST

జిల్లా జడ్జిని కలిసిన వెంకట సత్య ధనుష

NLR: కావలికి చెందిన దరిశి వెంకట సత్య ధనుష, ఇటీవల జూనియర్ సివిల్ న్యాయాధికారిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె గురువారం నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయంలో గౌరవ జిల్లా జడ్జి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ.. న్యాయ రంగం పట్ల నేటి యువత ఆసక్తి చూపడం అభినందనీయమని అన్నారు.

April 9, 2026 / 05:20 PM IST

పోలీస్ స్టాల్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు

BPT: సీఎం చంద్రబాబు గురువారం బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించి, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. భట్టిప్రోలు మండలం సూరేపల్లె గ్రామంలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమానికి హాజరైన ఆయన, ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ స్టాల్‌ను పరిశీలించారు

April 9, 2026 / 05:20 PM IST

‘కుక్కల బెడదను నివారించాలి’

పార్వతీపురం పట్టణంలో కుక్కల, ఆవుల విహరం విపరీతంగా ఉన్నాయని వాటి వలన జరుగుతున్న ఇబ్బందులను వెంటనే నివారించాలని సీపీఎం పట్టణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ కె.శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సమస్యకువెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.

April 9, 2026 / 05:15 PM IST

మధుపాడలో టేకు తోట దగ్ధం

VZM: గజపతినగరం మండలం మధుపాడలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక టేకు తోటలో గుర్తుతెలియని వ్యక్తులు పొగతాగి పడేయడంతో మంటలు చెలరేగాయి. బుర్ల నాయుడు, అప్పలనాయుడు, కృష్ణలకు చెందిన రెండు ఎకరాల తోట దగ్ధమైంది. ఇందులో సుమారు రూ. 30 వేల ఆస్తి నష్టం వచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

April 9, 2026 / 05:14 PM IST

ఏపీజే అబ్దుల్ కలాం పార్కును సందర్శించిన

SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం పార్కును సందర్శించారు. ఈ మేరకు పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కును అందరికీ అందుబాటులో ఉండే వినోద ప్రదేశంగా తీర్చిదిద్దాలని అన్నారు. అలాగే, పచ్చని వాతావరణంతో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

April 9, 2026 / 05:13 PM IST