కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వేకువజామున నుండి భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం 3 గంటలు నుండి రాత్రి ఆలయం మూసివేసే వరకూ రూ.30,01,121 ఆదాయం లభించిందని ఆలయ ఈవో కిషోర్ కుమార్ శనివారం రాత్రి తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు సిబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.