CTR: విజయవాడ వరద బాధితులకు బి.కొత్తకోట ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సభ్యులు రూ. లక్ష విరాళం అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. శనివారం రాత్రి అసోసియేషన్ సభ్యులు తంబళ్లపల్లె టీడీపీ ఇంఛార్జ్ జయచంద్ర రెడ్డిని ములకలచెరువులోని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రూ.లక్ష చెక్కును జయచంద్ర రెడ్డికి అందజేసి సీఎం రిలీఫ్ ఫండ్కు పంపాలని కోరారు.