కృష్ణా జిల్లా: రైళ్లలో దొంగతనాలు చేసే ఉత్తరప్రదేశ్కు చెందిన సూర్యపాల్ సింగ్ అనే వ్యక్తిని విజయవాడ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశామని ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం అతడు స్టేషన్లో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని 3 కేసులకు సంబంధించిన రూ.1.77లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. విచారణ అనంతరం సూర్యపాల్ సింగ్ను రిమాండ్కు పంపామన్నారు.