తూ.గో: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సెప్టెంబరు 23వ తేదీన యధావిధిగా చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, అర్జీలని క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండే డివిజనల్, మున్సిపల్, మండల అధికారులకి అందజేయాలన్నారు.