GNTR: రొంపిచర్ల మండలంలో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి చేపట్టిన ఉపాధి పనుల్లో సుమారు రూ.3 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రజావేదికలో సామాజిక తనిఖీ బృందం వెల్లడించాయి. మరో రూ.6 లక్షల ఉపాధి నిధులు వినియోగంపై విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు. రూ.9.25 కోట్లతో చేపట్టిన 602 పనులకు, సంబంధించి సోషల్ ఆడిట్ బృందాలు గ్రామాల్లో తనిఖీలు చేశారు.