ప్రకాశం: SGFI రాష్ట్రస్థాయి జూడో పోటీలకు సింగరాయకొండ మండలంలోని పాకల జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థులు, ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డీ.వీఎస్ ప్రసాద్ శనివారం తెలిపారు. జిల్లాస్ధాయి జూడో ఎంపిక కార్యక్రమంలో అండర్-14 విభాగంలో జూడోలో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.