ELR: నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని ఎం.ఆర్. అప్పారావు కాలనీలో త్రాగునీటి పైపులైన్ల నిర్మాణానికి శనివారం మంత్రి పార్థసారథి శంఖుస్థాపన చేశారు.