నెల్లూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 19 విభాగంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలను చిల్లకూరు గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించారు. రెండు వందల మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఆయా క్రీడలలో ఉత్తమ ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ, పీడీ శిరీశ్ తెలిపారు.