PLD: రాబోవు 5 సంవత్సరాలకు పల్నాడు జిల్లా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర @2047 విజన్ ముసాయిదాకు అనుగుణంగా జిల్లా, మండల స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు రూపకల్పన చేసే అంశాలపై దిశా నిర్దేశం చేశారు.