SKLM: సీతంపేట ఐటీడీఎ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, పోస్ట్మెట్రిక్ వసతిగృహాలకు ఆహార పదార్ధాలు సరఫరాకి ఐటీడీఎ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జీసీసీ టెండర్లను నిర్వహించింది. ఈ సందర్భంగా 31 వస్తువులు సరఫరాకి టెండర్లు నిర్వహించారు. 11 మంది టెండర్ దారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ అన్నదొర, జీసీసీ డీఎం సంధ్యారాణి, పాల్గొన్నారు.