KRNL: స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని నందమూరి తారక రామరావు పార్కులో పనికిరాని వస్తువులతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటుచేశారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాల మేరకు డీఈఈ నీరజ, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దీనిని రూపొందించారు. శనివారం దానిని ప్రారంభించగా మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.