ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ఆదివారం ప్రీతికరం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పొంగల్లు పెట్టారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.