కృష్ణా: దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆశా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పని భారం తగ్గించాలని కోరారు. పత్తికొండ మలేరియా సబ్ యూనిట్ అధికారి సాయిబాబా, ఏఎన్ఎంలు, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి హనుమంతమ్మ, రంగస్వామి, శ్రీధర్ స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.