విశాఖ: కొయ్యూరు మండలంలోని డౌనూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో శనివారం శ్రమదానంతో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఐటీడీఏ పీవో ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించామని ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటశాల, భోజన శాల ప్రాంతాలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను, పొదలను తొలగించారు. పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.