ATP: గుంతకల్ పట్టణంలోని సిఐటియు కాలనీలో శనివారం ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ గురుజాడ అప్పారావు 163 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గురుజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.