నెల్లూరు: బుచ్చి పట్టణంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆదివారం పర్యటించారు. నగర పంచాయతీ కార్యాలయం పనులను ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యంతో నగర పంచాయతీ కార్యాలయం అసంపూర్తిగా మిగిలింది అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పనులను పునం: ప్రారంభించామని తెలిపారు. ఆరు నెలల్లో నగర పంచాయతీ కార్యాలయం పూర్తి చేస్తామని వెల్లడించారు.