ELR: రైతులు సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టి అధిక దిగుబడి పొందాలని ఉంగుటూరు మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు అన్నారు. శనివారం నారాయణపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల నిర్మూలన మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలకనంద శ్రీనివాస్, వ్యవసాయ శాఖ సిబ్బంది మౌనిక సోనీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.